ETV Bharat / bharat

సొరంగంలో పెను విషాదం.. పది మృతదేహాలు వెలికితీత

author img

By

Published : May 21, 2022, 6:02 PM IST

Updated : May 21, 2022, 8:51 PM IST

Tunnel Collapse: జమ్ముకశ్మీర్‌లోని నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో.. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మరణించారు.

Tunnel Collapse
Tunnel Collapse
సొరంగంలో పెను విషాదం.. పది మృతదేహాలు వెలికితీత

Tunnel Collapse: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో పెను విషాదం నెలకొంది. శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మృతదేహాలను వెలికితీసినట్టు రాంబన్‌ పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

Tunnel Collapse
సహాయక చర్యల దృశ్యాలు
Tunnel Collapse
సహాయక చర్యల దృశ్యాలు

రాంబన్‌ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్‌ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంత భాగం గురువారం రాత్రి కూలిపోయింది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తాజాగా మరో కొండచరియ విరిగిపడటం వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదం నుంచి 15 మంది త్రుటిలో తప్పించుకున్నారు.

ఇవీ చదవండి: కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు కుక్క.. వీడియో వైరల్​.. యజమానిపై కేసు!

మొన్న రైలింజన్​.. నిన్న ఇనుప బ్రిడ్జ్​.. ఇప్పుడు విద్యుత్​ టవర్లనే కాజేసిన దొంగలు!

సొరంగంలో పెను విషాదం.. పది మృతదేహాలు వెలికితీత

Tunnel Collapse: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో పెను విషాదం నెలకొంది. శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మృతదేహాలను వెలికితీసినట్టు రాంబన్‌ పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

Tunnel Collapse
సహాయక చర్యల దృశ్యాలు
Tunnel Collapse
సహాయక చర్యల దృశ్యాలు

రాంబన్‌ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్‌ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంత భాగం గురువారం రాత్రి కూలిపోయింది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తాజాగా మరో కొండచరియ విరిగిపడటం వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదం నుంచి 15 మంది త్రుటిలో తప్పించుకున్నారు.

ఇవీ చదవండి: కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు కుక్క.. వీడియో వైరల్​.. యజమానిపై కేసు!

మొన్న రైలింజన్​.. నిన్న ఇనుప బ్రిడ్జ్​.. ఇప్పుడు విద్యుత్​ టవర్లనే కాజేసిన దొంగలు!

Last Updated : May 21, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.