ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ పునర్​వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం - జమ్ముకశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ(సవరణ)-బిల్లుకు పార్లమెంటు ఆమోదం

జమ్ముకశ్మీర్ పునర్​వ్యవస్థీకరణ(సవరణ)-బిల్లు 2021.. లోక్​సభలో శనివారం ఆమోదం పొందింది. దీంతో జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారులు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​) పరిధిలోకి రానున్నారు.

Govt introduces Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2021 in LS
జమ్ముకశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ(సవరణ)-బిల్లుకు పార్లమెంటు ఆమోదం
author img

By

Published : Feb 13, 2021, 3:55 PM IST

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లు 2021కు లోక్​సభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారుళను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరఁ యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​)లో విలీనం చేసే ఆర్డినెన్స్‌ ఇక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లును శనివారం కేంద్ర మంత్రి జీ కిషన్​ రెడ్డి లోక్​సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ ఫిబ్రవరి8న ఆమోదం తెలిపింది.

జమ్ముకశ్మీర్​లో సుమారు 170 కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని జీ. కిషన్​ రెడ్డి వివరించారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టడంపై ప్రతిపక్షనేత కాంగ్రెస్ ఎంపీ అధీర్​ రంజన్​ చౌదరి మండిపడ్డారు. అసలు జమ్ముకశ్మీర్​ పునర్విభజన ఆర్డినెన్స్​ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఆర్డినెన్స్​ తీసుకురావాలని, అవసరం లేకున్నా ఆర్డినెన్స్​ తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని అన్నారు.

"జమ్ముకశ్మీర్​ సున్నితమైనదని ఆ ప్రాంతానికి చెందిన వారినే సివిల్​ సర్వీస్​ లాంటి వాటిలో నియమించాలి. ఆర్టికల్​ 370 రద్దు చేశాక కశ్మీర్​ లోయలోకి కశ్మీరీ పండితులను తిరిగి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. ఇంత వరకు ఆ విషయంలో ముందడుగు పడలేదు. జమ్ముకశ్మీర్​ విషయంలో తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవద్దు. అక్కడి అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయండి."

-అధీర్​ రంజన్​ చౌదరి, ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ

ఈ బిల్లు వల్ల జమ్ముకశ్మీర్​లో అస్థిరత ఏర్పడుతుందని నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ ఎంపీ అస్నైన్​ మసూదీ అన్నారు. జమ్ముకశ్మీర్​కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

జమ్ముకశ్మీర్​లో మీరు (కేంద్రం) గందరగోళాన్ని పెంచుతున్నారు. ఈ బిల్లు లక్ష్యం ఏమిటి?

-అస్నైన్​ మసూదీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ ఎంపీ

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లు 2021కు లోక్​సభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారుళను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరఁ యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​)లో విలీనం చేసే ఆర్డినెన్స్‌ ఇక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లును శనివారం కేంద్ర మంత్రి జీ కిషన్​ రెడ్డి లోక్​సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ ఫిబ్రవరి8న ఆమోదం తెలిపింది.

జమ్ముకశ్మీర్​లో సుమారు 170 కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని జీ. కిషన్​ రెడ్డి వివరించారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టడంపై ప్రతిపక్షనేత కాంగ్రెస్ ఎంపీ అధీర్​ రంజన్​ చౌదరి మండిపడ్డారు. అసలు జమ్ముకశ్మీర్​ పునర్విభజన ఆర్డినెన్స్​ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఆర్డినెన్స్​ తీసుకురావాలని, అవసరం లేకున్నా ఆర్డినెన్స్​ తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని అన్నారు.

"జమ్ముకశ్మీర్​ సున్నితమైనదని ఆ ప్రాంతానికి చెందిన వారినే సివిల్​ సర్వీస్​ లాంటి వాటిలో నియమించాలి. ఆర్టికల్​ 370 రద్దు చేశాక కశ్మీర్​ లోయలోకి కశ్మీరీ పండితులను తిరిగి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. ఇంత వరకు ఆ విషయంలో ముందడుగు పడలేదు. జమ్ముకశ్మీర్​ విషయంలో తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవద్దు. అక్కడి అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయండి."

-అధీర్​ రంజన్​ చౌదరి, ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ

ఈ బిల్లు వల్ల జమ్ముకశ్మీర్​లో అస్థిరత ఏర్పడుతుందని నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ ఎంపీ అస్నైన్​ మసూదీ అన్నారు. జమ్ముకశ్మీర్​కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

జమ్ముకశ్మీర్​లో మీరు (కేంద్రం) గందరగోళాన్ని పెంచుతున్నారు. ఈ బిల్లు లక్ష్యం ఏమిటి?

-అస్నైన్​ మసూదీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ ఎంపీ

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

For All Latest Updates

TAGGED:

2021 in LS
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.