ETV Bharat / bharat

'మోదీజీ... టీకా ఎగుమతులు నిషేధించండి' - 'దేశ ప్రమాదంలోకి నెట్టి.. టీకా ఎగుమతులా?'

విదేశాలకు టీకా సరఫరా చేయటంపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికి టీకా పంపిణి చేయాలని సూచించారు. బలహీనవర్గాల వారికి ప్రత్యక్ష నగదు బదిలీ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Rahul Gandhi
టీకా ఎగుమతులపై మోదీకి రాహుల్​ లేఖ
author img

By

Published : Apr 9, 2021, 12:06 PM IST

Updated : Apr 9, 2021, 2:36 PM IST

కరోనా వ్యాక్సిన్​ ఎగుమతులపై తక్షణమే తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్​ సరఫరాలో రాష్ట్రాలకు మరింత తోడ్పాటు అందించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్​ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. బలహీన వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అండగా నిలవాలని మోదీని కోరారు రాహుల్.

"వ్యాక్సిన్​ తయారీదారులకు టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన వనురులను కల్పించాలని నేను కోరుతున్నాను. అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా అందించే కార్యక్రమాన్ని చేపట్టండి. వ్యాక్సిన్ల సేకరణ, సరఫరా కోసం కేటాయించిన రూ.35,000 కోట్ల నిధులను రెట్టింపు చేయండి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

దేశంలో వ్యాక్సిన్ కొరత సమస్య వేధిస్తోంటే.. ఆరు కోట్ల టీకా డోసులను విదేశాలకు కేంద్రం ఎగమతి చేసిందని రాహుల్ గాంధీ తన లేఖలో విమర్శించారు. టీకా కొరత దృష్ట్యా ప్రాధాన్య క్రమంలోనే వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మరుసటి రోజే రాహుల్​ ఈ లేఖ రాయటం గమనార్హం.

'టీకా ఎగమతులపై పర్యవేక్షణ ఉందా? లేదా ప్రభుత్వం తీసుకున్న అనేక ఇతర నిర్ణయాల్లానే.. ప్రజల ఖర్చుతో పబ్లిసిటీ పొందే ప్రయత్నమా?' అని రాహుల్​ ప్రశ్నించారు. విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ మాట్లాడుతున్నారని విమర్శించారు.

'ప్రమాదంలోకి నెట్టి.. ఎగమతులా?'

అంతకుముందు.. దేశవాసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, విదేశాలకు సరఫరా చేయడం సరైన చర్యేనా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా రాహుల్​ ప్రశ్నించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో టీకాల కొరత అనేది తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. ఇది వేడుక చేసుకునే సమయం కాదని విమర్శించారు.

ఇదీ చూడండి: చురుగ్గా 'అందరికీ టీకా'నే అత్యంత కీలకం

కరోనా వ్యాక్సిన్​ ఎగుమతులపై తక్షణమే తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్​ సరఫరాలో రాష్ట్రాలకు మరింత తోడ్పాటు అందించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్​ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. బలహీన వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అండగా నిలవాలని మోదీని కోరారు రాహుల్.

"వ్యాక్సిన్​ తయారీదారులకు టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన వనురులను కల్పించాలని నేను కోరుతున్నాను. అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా అందించే కార్యక్రమాన్ని చేపట్టండి. వ్యాక్సిన్ల సేకరణ, సరఫరా కోసం కేటాయించిన రూ.35,000 కోట్ల నిధులను రెట్టింపు చేయండి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

దేశంలో వ్యాక్సిన్ కొరత సమస్య వేధిస్తోంటే.. ఆరు కోట్ల టీకా డోసులను విదేశాలకు కేంద్రం ఎగమతి చేసిందని రాహుల్ గాంధీ తన లేఖలో విమర్శించారు. టీకా కొరత దృష్ట్యా ప్రాధాన్య క్రమంలోనే వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మరుసటి రోజే రాహుల్​ ఈ లేఖ రాయటం గమనార్హం.

'టీకా ఎగమతులపై పర్యవేక్షణ ఉందా? లేదా ప్రభుత్వం తీసుకున్న అనేక ఇతర నిర్ణయాల్లానే.. ప్రజల ఖర్చుతో పబ్లిసిటీ పొందే ప్రయత్నమా?' అని రాహుల్​ ప్రశ్నించారు. విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ మాట్లాడుతున్నారని విమర్శించారు.

'ప్రమాదంలోకి నెట్టి.. ఎగమతులా?'

అంతకుముందు.. దేశవాసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, విదేశాలకు సరఫరా చేయడం సరైన చర్యేనా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా రాహుల్​ ప్రశ్నించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో టీకాల కొరత అనేది తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. ఇది వేడుక చేసుకునే సమయం కాదని విమర్శించారు.

ఇదీ చూడండి: చురుగ్గా 'అందరికీ టీకా'నే అత్యంత కీలకం

Last Updated : Apr 9, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.