దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది. తాజాగా 25,153 కేసులు వెలుగుచూశాయి. కోటి కేసుల మార్కును దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కు చేరగా.. మరో 347 తాజా మరణాలతో.. మృతుల సంఖ్య 1,45,136కు పెరిగింది. 95.5లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,08,751 యాక్టివ్ కేసులున్నాయి.
కొవిడ్ కేసులు కోటికి చేరాయిలా....
- ఆగస్టు 7- 20 లక్షలు
- ఆగస్టు 23- 30 లక్షలు
- సెప్టెంబర్ 5- 40 లక్షలు
- సెప్టెంబర్ 16- 50 లక్షలు
- సెప్టెంబర్ 28- 60 లక్షలు
- అక్టోబర్ 11- 70 లక్షలు
- అక్టోబర్ 29- 80 లక్షలు
- నవంబర్ 20- 90 లక్షలు
- డిసెంబర్ 19- 1,00,04,599
గత నెలరోజుల్లో దాదాపు 10లక్షల కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:- '2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'