సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు సుదీర్ఘంగా జరుగుతున్న ప్రయత్నాలపై భారత్ అప్రమత్తంగానే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్నాథ్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో 83 తేజస్ విమానాల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందని అన్నారు. ఇప్పుడా ఉగ్రవాదం ప్రపంచదేశాలకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు.
రక్షణ రంగంలో సంస్కరణలు
ఎగుమతులకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు 2014 నుంచి కేంద్రం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు రాజ్నాథ్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితిని సడలించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో.. భారతదేశం మేడిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్(ప్రపంచం కోసం తయారు చేయడం) స్థాయికి ఎదుగుతోందని చెప్పారు.
"ఆత్మనిర్భర్ భారత్, ఎగుమతులను పెంపొందించం వంటి లక్ష్యాలను సాధించేందుకు రక్షణ రంగంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. 2024 నాటికి రక్షణ, ఏరోస్పేస్ రంగంలో వస్తుసేవల ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని నిర్దేశించుకుంది."
- రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
వచ్చే ఏడు-ఎనిమిది సంవత్సరాలలో రక్షణ రంగ ఆధునికీకరణపై రూ.130 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయ తయారీపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు వివరించారు. భారత్కు సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, అక్కడ ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు గ్రెటా థన్బర్గ్ మద్దతు