ETV Bharat / bharat

గల్వాన్​ ఘటనకు ఏడాది.. మరువలేనివి సైనికుల త్యాగాలు

author img

By

Published : Jun 15, 2021, 5:21 AM IST

Updated : Jun 15, 2021, 7:52 AM IST

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల పరస్పర ఘర్షణలకు ఏడాది పూర్తయింది. 2020 జూన్‌ 15న జరిగిన ఈ ఘర్షణలల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

galwan valley clash
గల్వాన్​ ఘటనకు ఏడాది.. మరువలేనివి సైనికుల త్యాగాలు

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన పెను ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తవుతుంది. నాడు డ్రాగన్ దురాగతాన్ని ఎదిరిస్తూ తెలుగు యోధుడు కర్నల్ సంతోష్​ బాబు(Colonel Santosh Babu) నేతృత్వంలోని భారత సైనికులు చూపిన తెగువ, చేసిన బలిదానాన్ని ఈ సందర్భంగా దేశం స్మరించుకోనుంది.

2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో దాదాపు 5 దశాబ్దాల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్​ బాబు సహా.. 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

ఈ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారీగా బలగాలు, ఆయుధాలను సరిహద్దుల్లోకి తరలించాయి. గల్వాన్ ఘర్షణల్లో తమ సైనికులు ఐదుగురు చనిపోయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మొదటిసారిగా అంగీకరించింది. భారత్, చైనాల విదేశాంగ మంత్రుల మధ్య సంప్రదింపులు, సైనిక చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉపసంహరణ పూర్తికాలేదు.

ఇవీ చదవండి:

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన పెను ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తవుతుంది. నాడు డ్రాగన్ దురాగతాన్ని ఎదిరిస్తూ తెలుగు యోధుడు కర్నల్ సంతోష్​ బాబు(Colonel Santosh Babu) నేతృత్వంలోని భారత సైనికులు చూపిన తెగువ, చేసిన బలిదానాన్ని ఈ సందర్భంగా దేశం స్మరించుకోనుంది.

2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో దాదాపు 5 దశాబ్దాల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్​ బాబు సహా.. 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

ఈ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారీగా బలగాలు, ఆయుధాలను సరిహద్దుల్లోకి తరలించాయి. గల్వాన్ ఘర్షణల్లో తమ సైనికులు ఐదుగురు చనిపోయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మొదటిసారిగా అంగీకరించింది. భారత్, చైనాల విదేశాంగ మంత్రుల మధ్య సంప్రదింపులు, సైనిక చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉపసంహరణ పూర్తికాలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 15, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.