ETV Bharat / bharat

Kulbhushan Jadhav: 'ఆ బిల్లులో లోపాలు సరిచేయాలి'

author img

By

Published : Jun 17, 2021, 9:09 PM IST

Updated : Jun 17, 2021, 10:46 PM IST

కుల్​భూషణ్​ జాదవ్​ మరణశిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. మరోవైపు కశ్మీర్​.. భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అలాగే ఛోక్సి విషయలోనూ భారత్ చురుగ్గా గా వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.

India pak
భారత్​ పాక్​

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌(kulbhushan jadhav) తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. జాదవ్​ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పు (ఐసీజే) అమలు చేయాలని పేర్కొంది(ICJ kulbhushan jadhav).

అయితే ఐసీజే ప్రకారం కుల్​భూషణ్​కు భారత అధికారులతో సంప్రదింపులు జరుపుకునే అవకాశం కల్పించడంలో పాక్​ విఫలమైంది. ఈ కారణంగా జాదవ్​కు అన్యాయం జరిగిందా? అని నిర్ణయించడానికి మున్సిపల్​ కోర్టును ఆహ్వానించేలా ఈ బిల్లులో నిబంధన ఉందని విదేశాంగ మంత్రత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇందుకు అవకాశంలేదన్నారు.

ఇటీవల ఈ బిల్లుకు పాక్​​ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

'కశ్మీర్​.. భారత్​లో అంతర్భాగం'

కశ్మీర్​.. భారత్​లో అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రశ్నించినంత మాత్రన వాస్తవంలో మార్పుండదని వ్యాఖ్యానించింది. కశ్మీర్ అంశంలో భారత్​పై ఆరోపణలు చేస్తూ పాక్​ మంత్రి.. ఐరాసకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్​.

డొమినికాతో చురుగ్గా చర్చలు!

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ.. అప్పగింత విషయమైన డొమినికాతో చురుగ్గా భారత్​ చర్చలు జరుపుతోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఛోక్సీ.. డొమినికాలో అక్రమంగా ప్రవేశించిన కేసుపై ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం.. 25కు వాయిదావేసింది.

ఇదీ చూడండి: Choksi: 'భారత్‌ పేరు వింటే బీపీ పెరుగుతోంది'

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌(kulbhushan jadhav) తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. జాదవ్​ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పు (ఐసీజే) అమలు చేయాలని పేర్కొంది(ICJ kulbhushan jadhav).

అయితే ఐసీజే ప్రకారం కుల్​భూషణ్​కు భారత అధికారులతో సంప్రదింపులు జరుపుకునే అవకాశం కల్పించడంలో పాక్​ విఫలమైంది. ఈ కారణంగా జాదవ్​కు అన్యాయం జరిగిందా? అని నిర్ణయించడానికి మున్సిపల్​ కోర్టును ఆహ్వానించేలా ఈ బిల్లులో నిబంధన ఉందని విదేశాంగ మంత్రత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇందుకు అవకాశంలేదన్నారు.

ఇటీవల ఈ బిల్లుకు పాక్​​ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

'కశ్మీర్​.. భారత్​లో అంతర్భాగం'

కశ్మీర్​.. భారత్​లో అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రశ్నించినంత మాత్రన వాస్తవంలో మార్పుండదని వ్యాఖ్యానించింది. కశ్మీర్ అంశంలో భారత్​పై ఆరోపణలు చేస్తూ పాక్​ మంత్రి.. ఐరాసకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్​.

డొమినికాతో చురుగ్గా చర్చలు!

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ.. అప్పగింత విషయమైన డొమినికాతో చురుగ్గా భారత్​ చర్చలు జరుపుతోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఛోక్సీ.. డొమినికాలో అక్రమంగా ప్రవేశించిన కేసుపై ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం.. 25కు వాయిదావేసింది.

ఇదీ చూడండి: Choksi: 'భారత్‌ పేరు వింటే బీపీ పెరుగుతోంది'

Last Updated : Jun 17, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.