ETV Bharat / bharat

కూరగాయలు అమ్ముతున్న కలెక్టర్​- ఫొటో వైరల్

ఓ ఐఏఎస్ అధికారి ఒక్కసారిగా కూరగాయలు అమ్మే వ్యక్తి అవతారమెత్తారు. తన వద్ద టమాటాలను కొనండి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటో పోస్ట్ చేశారు. దీంతో కంగుతినడం నెటిజన్ల వంతైంది. ఇంతకీ కథేంటంటే?

author img

By

Published : Aug 26, 2021, 10:27 PM IST

IAS selling vegetables
కూరగాయలు అమ్మిన ఐఏఎస్ అధికారి

ఐఏఎస్ అధికారి రోడ్లపై కూరగాయలు కొనడమే అరుదు. అలాంటిది రోడ్డు పక్కన కూరగాయాలు విక్రయిస్తూ దర్శనమిచ్చారు ఓ పాలనాధికారి. 'రూ.20కి కిలో టమాటాలు రండి.. కొనండి' అంటూ ఫేస్​బుక్​లోనూ పోస్టు పెట్టారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా?

IAS selling vegetables
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఫొటో కథేంటంటే?

ఉత్తర్​ప్రదేశ్​ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అఖిలేశ్ మిశ్ర. రోడ్డు పక్కన ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి తన ఫేస్​బుక్​ పేజీలో కనిపించింది. దీంతో అది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కలెక్టర్​ ఏంటి.. కూరగాయలు అమ్మడమేంటి? అని షాకయ్యారు నెటిజన్లు.

IAS selling vegetables
ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఆమె అడిగిందని..!

దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు అఖిలేశ్ మిశ్ర. ఫొటో నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మడం వాస్తవం కాదని చెప్పారు.

IAS selling vegetables
రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ

"అధికారిక పని నిమిత్తం ప్రయాగ్​రాజ్​ వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో కూరగాయల కోసం దిగాను. ఆ సమయంలో కూరగాయలు అమ్మే ఆవిడ.. తన తన పిల్లాడు ఎటో వెళ్లాడని, తన కోసం చూసి వస్తా అని చెప్పి.. నన్ను తన దుకాణాన్ని కాసేపు చూస్తూ ఉండమని చెప్పింది. దీంతో అక్కడే కూర్చున్నా. ఈ లోపే కొందరు అక్కడికి కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్​బుక్​లో పెట్టారు" అని అఖిలేశ్ వివరించారు.

ఫొటో పెట్టిన విషయం మొదట తనకు తెలీదని అఖిలేశ్ పేర్కొన్నారు. తర్వాత చూసుకొని పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ ఐఏఎస్‌ టాపర్స్‌ జంట విడిపోయింది!

ఐఏఎస్ అధికారి రోడ్లపై కూరగాయలు కొనడమే అరుదు. అలాంటిది రోడ్డు పక్కన కూరగాయాలు విక్రయిస్తూ దర్శనమిచ్చారు ఓ పాలనాధికారి. 'రూ.20కి కిలో టమాటాలు రండి.. కొనండి' అంటూ ఫేస్​బుక్​లోనూ పోస్టు పెట్టారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా?

IAS selling vegetables
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఫొటో కథేంటంటే?

ఉత్తర్​ప్రదేశ్​ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అఖిలేశ్ మిశ్ర. రోడ్డు పక్కన ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి తన ఫేస్​బుక్​ పేజీలో కనిపించింది. దీంతో అది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కలెక్టర్​ ఏంటి.. కూరగాయలు అమ్మడమేంటి? అని షాకయ్యారు నెటిజన్లు.

IAS selling vegetables
ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఆమె అడిగిందని..!

దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు అఖిలేశ్ మిశ్ర. ఫొటో నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మడం వాస్తవం కాదని చెప్పారు.

IAS selling vegetables
రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ

"అధికారిక పని నిమిత్తం ప్రయాగ్​రాజ్​ వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో కూరగాయల కోసం దిగాను. ఆ సమయంలో కూరగాయలు అమ్మే ఆవిడ.. తన తన పిల్లాడు ఎటో వెళ్లాడని, తన కోసం చూసి వస్తా అని చెప్పి.. నన్ను తన దుకాణాన్ని కాసేపు చూస్తూ ఉండమని చెప్పింది. దీంతో అక్కడే కూర్చున్నా. ఈ లోపే కొందరు అక్కడికి కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్​బుక్​లో పెట్టారు" అని అఖిలేశ్ వివరించారు.

ఫొటో పెట్టిన విషయం మొదట తనకు తెలీదని అఖిలేశ్ పేర్కొన్నారు. తర్వాత చూసుకొని పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ ఐఏఎస్‌ టాపర్స్‌ జంట విడిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.