ETV Bharat / bharat

'భారత వాయుసేన వల్లే దూకుడు తగ్గించిన చైనా'

author img

By

Published : Nov 6, 2020, 10:21 PM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత వాయుసేన చూపిన తెగువ వల్లే ప్రత్యర్థి దేశం కుయుక్తులను తిప్పికొట్టగలిగామని భారత ఎయిర్​ ఛీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా తెలిపారు. దిల్లీలోని డిఫెన్స్​ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన ఆన్​లైన్​ సెమినార్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

AF'S strong posturing during Ladakh standoff helped India ward off any threat from China
'భారత వాయు సేన చూపిన తెగువతోనే చైనా దూకుడు తగ్గింది'

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో.. లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత వాయు సేన పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహించామని ఎయిర్​ ఛీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా తెలిపారు. అందుకే చైనా తన దుందుడుకు చర్యలను తగ్గించిందని స్పష్టం చేశారు.

ఘర్షణల సమయంలో వాయుసేనను దింపటం వల్ల భారత సైన్యం శక్తి సామర్థ్యాలు డ్రాగన్ దేశానికి అర్థమైందని పేర్కొన్నారు. సుఖోయ్​-30ఎమ్​కేఐ, జాగ్వార్, మిరేజ్​-2000 వంటి అత్యాధునిక ఫైటర్​ జెట్లు వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరం కాపలా కాశాయని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాకోట్​ ఘటనలోనూ వాయు సేన అద్భుత తెగువ కనబరిచిందని కొనియాడారు బదౌరియా.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో.. లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత వాయు సేన పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహించామని ఎయిర్​ ఛీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా తెలిపారు. అందుకే చైనా తన దుందుడుకు చర్యలను తగ్గించిందని స్పష్టం చేశారు.

ఘర్షణల సమయంలో వాయుసేనను దింపటం వల్ల భారత సైన్యం శక్తి సామర్థ్యాలు డ్రాగన్ దేశానికి అర్థమైందని పేర్కొన్నారు. సుఖోయ్​-30ఎమ్​కేఐ, జాగ్వార్, మిరేజ్​-2000 వంటి అత్యాధునిక ఫైటర్​ జెట్లు వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరం కాపలా కాశాయని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాకోట్​ ఘటనలోనూ వాయు సేన అద్భుత తెగువ కనబరిచిందని కొనియాడారు బదౌరియా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.