ETV Bharat / bharat

కరోనాతో భర్త మృతి.. భార్య, కొడుకు ఆత్మహత్య - ఝార్ఖండ్ లో కొవిడ్​ ఆసుపత్రిలో ఉరేసుకున్న రోగి

కుటుంబ సభ్యులు కరోనాతో మరణించగా.. మనోవేదనకు గురైన ఓ మహిళ, ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఘటనలో కొవిడ్​ రోగి.. ఆసుపత్రిలోనే ఉరేసుకుని మరణించాడు. అదే ఆసుపత్రిలో ఆక్సిజన్​ కొరతతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

commited suicide under train
రైలు కింద శవం
author img

By

Published : Apr 19, 2021, 3:08 PM IST

కర్ణాటకలోని బెంగళూరు​ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ కుటుంబాన్ని కరోనా వైరస్​ పొట్టన పెట్టుకుంది. కుటుంబంలో ఓ వ్యక్తి, ఆయన తల్లి కరోనా కారణంగా మరణించారు. తన భర్త, అత్త మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ.. కుమారుడితో కలిసి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది.

జిల్లాలోని బెంగళూరు ఉత్తర తాలూక, సోమశెట్టిహళ్లి ప్రాంతంలో రేఖ.. తన కుటుంబంతో ఉండేది. గత ఏడాది అక్టోబర్​ 20న ఆమె భర్త శివరాజ్​ కరోనాతో మరణించారు. శివరాజ్​ చనిపోయిన వారం రోజులకు ఆయన తల్లి శివాంభిక కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వారి మరణంతో రేఖ.. ఆమె కుమారుడు మనోజ్​ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.

శివకుమార్.. కాంట్రాక్టర్​ వృత్తి చేసేవారు. వారి కుటుంబం​ ఆర్థికంగా స్థిరపడింది.

కొవిడ్​ ఆసుపత్రిలోనే ఉరేసుకుని..

ఝార్ఖండ్​ గడవా జిల్లా కొవిడ్​ ఆసుపత్రిలో ఒకరు ఉరేసుకుని చనిపోగా.. మరొకరు ఆక్సిజన్​ కొరతతో మరణించారు. నీరజ్​ ఉపాధ్యాయ (39) అనే వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరారు. భయాందోళనతో ఆసుపత్రిలో ఉరేసుకుని మరణించారు. అదే ఆసుపత్రిలో శివచంద్​ విశ్వకర్మ (46 ) అనే మరో వ్యక్తి ఆక్సిజన్​ కొరతతో మరణించారు. శ్వాస తీసుకోవడానికి కష్టమవుతోందని, ఆక్సిజన్​ సౌకర్యం కల్పించాలని కోరినా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇదీ చదవండి: కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ

ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం

కర్ణాటకలోని బెంగళూరు​ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ కుటుంబాన్ని కరోనా వైరస్​ పొట్టన పెట్టుకుంది. కుటుంబంలో ఓ వ్యక్తి, ఆయన తల్లి కరోనా కారణంగా మరణించారు. తన భర్త, అత్త మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ.. కుమారుడితో కలిసి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది.

జిల్లాలోని బెంగళూరు ఉత్తర తాలూక, సోమశెట్టిహళ్లి ప్రాంతంలో రేఖ.. తన కుటుంబంతో ఉండేది. గత ఏడాది అక్టోబర్​ 20న ఆమె భర్త శివరాజ్​ కరోనాతో మరణించారు. శివరాజ్​ చనిపోయిన వారం రోజులకు ఆయన తల్లి శివాంభిక కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వారి మరణంతో రేఖ.. ఆమె కుమారుడు మనోజ్​ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.

శివకుమార్.. కాంట్రాక్టర్​ వృత్తి చేసేవారు. వారి కుటుంబం​ ఆర్థికంగా స్థిరపడింది.

కొవిడ్​ ఆసుపత్రిలోనే ఉరేసుకుని..

ఝార్ఖండ్​ గడవా జిల్లా కొవిడ్​ ఆసుపత్రిలో ఒకరు ఉరేసుకుని చనిపోగా.. మరొకరు ఆక్సిజన్​ కొరతతో మరణించారు. నీరజ్​ ఉపాధ్యాయ (39) అనే వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరారు. భయాందోళనతో ఆసుపత్రిలో ఉరేసుకుని మరణించారు. అదే ఆసుపత్రిలో శివచంద్​ విశ్వకర్మ (46 ) అనే మరో వ్యక్తి ఆక్సిజన్​ కొరతతో మరణించారు. శ్వాస తీసుకోవడానికి కష్టమవుతోందని, ఆక్సిజన్​ సౌకర్యం కల్పించాలని కోరినా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇదీ చదవండి: కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ

ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.