ETV Bharat / bharat

Hitech Copying in JEE Exam : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 'స్మార్ట్‌ కాపీయింగ్‌'.. పోలీసుల అదుపులో విద్యార్థి

author img

By

Published : Jun 6, 2023, 11:59 AM IST

Updated : Jun 6, 2023, 1:54 PM IST

Mass Copying in JEE Advanced Exam : హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో జరిగిన స్మార్ట్‌ కాపీయింగ్‌ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

JEE Advanced Exam Copied
JEE Advanced Exam Copied

Student arrested for Hitech Copying in JEE Advanced Exam : నలుగురు కుర్రాళ్లు వాట్సాప్ గ్రూప్ పెట్టి మరీ జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఘటన సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం నాడు(జూన్ 4న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన చింతపల్లి చైతన్య కృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు.. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాలలో జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాశారు.

Hitech Copying in JEE Exam : పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేదో ఏమో మరీ.. ఈ నలుగురు కాపీయింగ్​కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం పరీక్షకు వారు చాకచక్యంగా తమ తమ స్మార్ట్ ఫోన్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. నలుగురిలోనూ తెలివైన విద్యార్థి. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎన్​పీఐటీ కాలేజ్​లో పరీక్ష రాసి, గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాల స్క్రీన్ షాట్స్​ను వాట్సాప్ గ్రూప్​లో పోస్ట్ చేశాడు. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.

  • జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో.. తెలుగు విద్యార్థుల సత్తా
  • జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

Smart Copying in JEE Advanced Exam : ఈ క్రమంలోనే ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ ఈ బాగోతాన్ని గమనించి విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా.. మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ కేంద్రం వారు హైదరాబాద్ ఐఐటీ అధికారులకు సమాచారం అందించారు. వారు సికింద్రాబాద్ ఎస్పీ ఐఈ సెంటర్లో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్​కు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన ఇన్విజిలేటర్​ వెంటనే వెళ్లి తనిఖీ చేయగా విద్యార్థి వద్ద స్మార్ట్ ఫోన్ లభిచింది. దీంతో ఆ పరీక్షా కేంద్రం అధికారులు మెండా మార్కెట్ పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు.

Mass Copying in JEE Advanced Exam : అతడిపై మెండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సికింద్రాబాద్ ఎస్​పీఐటీ సెంటర్​లో పట్టుబడిన ఆ తెలివైన విద్యార్థిది కడప జిల్లా. ఎస్ఎస్​సీలో 600/800 మార్కులు, ఇంటర్లో 940/1000 మార్కులు సాధించాడు. ఇంత తెలివైన విద్యార్థి.. స్నేహితుల కోసం తన భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడని అతడి బంధువు ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరీక్ష నిర్వహణను హైదరాబాద్ ఐఐటీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. విద్యార్థి స్మార్ట్​ ఫోన్​ను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని సదరు సంస్థ గమనించలేదు. పరీక్ష హాల్ పెద్దగా ఉండడం. ఇన్విజిలేటర్ ఎక్కడో ఒక చోట కూర్చుని ఉండడం వల్లనే ఫోన్లలో జవాబులను తమ వాట్సాప్ గ్రూపునకు పంపడం సులువైందని పట్టుబడ్డ విద్యార్థి చెబుతుండడం గమనార్హం.

ఇవీ చదవండి:

Student arrested for Hitech Copying in JEE Advanced Exam : నలుగురు కుర్రాళ్లు వాట్సాప్ గ్రూప్ పెట్టి మరీ జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఘటన సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం నాడు(జూన్ 4న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన చింతపల్లి చైతన్య కృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు.. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాలలో జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాశారు.

Hitech Copying in JEE Exam : పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేదో ఏమో మరీ.. ఈ నలుగురు కాపీయింగ్​కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం పరీక్షకు వారు చాకచక్యంగా తమ తమ స్మార్ట్ ఫోన్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. నలుగురిలోనూ తెలివైన విద్యార్థి. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎన్​పీఐటీ కాలేజ్​లో పరీక్ష రాసి, గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాల స్క్రీన్ షాట్స్​ను వాట్సాప్ గ్రూప్​లో పోస్ట్ చేశాడు. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.

  • జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో.. తెలుగు విద్యార్థుల సత్తా
  • జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

Smart Copying in JEE Advanced Exam : ఈ క్రమంలోనే ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ ఈ బాగోతాన్ని గమనించి విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా.. మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ కేంద్రం వారు హైదరాబాద్ ఐఐటీ అధికారులకు సమాచారం అందించారు. వారు సికింద్రాబాద్ ఎస్పీ ఐఈ సెంటర్లో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్​కు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన ఇన్విజిలేటర్​ వెంటనే వెళ్లి తనిఖీ చేయగా విద్యార్థి వద్ద స్మార్ట్ ఫోన్ లభిచింది. దీంతో ఆ పరీక్షా కేంద్రం అధికారులు మెండా మార్కెట్ పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు.

Mass Copying in JEE Advanced Exam : అతడిపై మెండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సికింద్రాబాద్ ఎస్​పీఐటీ సెంటర్​లో పట్టుబడిన ఆ తెలివైన విద్యార్థిది కడప జిల్లా. ఎస్ఎస్​సీలో 600/800 మార్కులు, ఇంటర్లో 940/1000 మార్కులు సాధించాడు. ఇంత తెలివైన విద్యార్థి.. స్నేహితుల కోసం తన భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడని అతడి బంధువు ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరీక్ష నిర్వహణను హైదరాబాద్ ఐఐటీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. విద్యార్థి స్మార్ట్​ ఫోన్​ను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని సదరు సంస్థ గమనించలేదు. పరీక్ష హాల్ పెద్దగా ఉండడం. ఇన్విజిలేటర్ ఎక్కడో ఒక చోట కూర్చుని ఉండడం వల్లనే ఫోన్లలో జవాబులను తమ వాట్సాప్ గ్రూపునకు పంపడం సులువైందని పట్టుబడ్డ విద్యార్థి చెబుతుండడం గమనార్హం.

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.