ETV Bharat / bharat

జీవోలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ? అంత అవసరమేంటి ?: ఏపీ హైకోర్టు - Hearing in High Court on petition against Govt

high_court_comments_on_govt
high_court_comments_on_govt
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 8:21 PM IST

Updated : Nov 15, 2023, 8:42 PM IST

20:15 November 15

ప్రభుత్వ జీవోల గోప్యతపై వచ్చే బుధవారం విచారణ

High Court Comments on Govt keeping GOs Secret: జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..? అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అంటూ జీవోల గోప్యతపై హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ జీవోల గోప్యతపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరపాలని న్యాయవాదులు ఉమేష్ చంద్ర, అంబటి సుధాకర్, యలమంజుల బాలాజీ, శ్రీకాంత్​లు సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2021లో వేసిన పిటిషన్​పై ఇంకా విచారణ జరగుతుందని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. డెబ్బై శాతం జీవోలను వెబ్ సైట్​లో ఉంచటం లేదని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయి.. ఆ హక్కులను మీరెలా కాలరాస్తారు అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోలను వెబ్ సైట్​లో ఉంచటంపై తాను పూర్తి వివరాలు అందిస్తానని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్​పై విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరటంతో.. వచ్చే బుధవారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది.

20:15 November 15

ప్రభుత్వ జీవోల గోప్యతపై వచ్చే బుధవారం విచారణ

High Court Comments on Govt keeping GOs Secret: జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..? అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అంటూ జీవోల గోప్యతపై హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ జీవోల గోప్యతపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరపాలని న్యాయవాదులు ఉమేష్ చంద్ర, అంబటి సుధాకర్, యలమంజుల బాలాజీ, శ్రీకాంత్​లు సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2021లో వేసిన పిటిషన్​పై ఇంకా విచారణ జరగుతుందని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. డెబ్బై శాతం జీవోలను వెబ్ సైట్​లో ఉంచటం లేదని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయి.. ఆ హక్కులను మీరెలా కాలరాస్తారు అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోలను వెబ్ సైట్​లో ఉంచటంపై తాను పూర్తి వివరాలు అందిస్తానని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్​పై విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరటంతో.. వచ్చే బుధవారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది.

Last Updated : Nov 15, 2023, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.