Juhi Chawla 5G: సినీ నటి జూహీ చావ్లాకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 5జీకు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్పై ఇదివరకు కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆమెకు విధించిన రూ.20 లక్షల జరిమానాను రూ.2 లక్షలకు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. రూ.20 లక్షల జరిమానా విధిస్తూ.. ఇది వరకు దిల్లీ హై కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ.. జూహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్పై విచారించింది ధర్మాసనం. ఆమె నిర్లక్ష్యధోరణితో 5జీపై కేసును దాఖలు చేయలేదని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మిత్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆమెపై విధించిన జరిమానాను కూడా తగ్గించింది.
ఇదీ జరిగింది..
5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ఆ రేడియేషన్ ధాటికి పర్యావరణం దెబ్బతింటుందంటూ జూహీ చావ్లా గతేడాది మే నెలలో దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5జీ సాంకేతికత మానవాళితో పాటు యావత్ వృక్ష, జంతుజాలానికి సురక్షితమని అధికారులు ధ్రువీకరించేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యంలో కోరారు జూహీ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇది లోపభూయిష్ట పిటిషన్గా అభివర్ణించింది. మీడియాలో పబ్లిసిటీ కోసమే వ్యాజ్యాన్ని దాఖలు చేశారని పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జేఆర్ మిధా వ్యాఖ్యానించారు. ఈ కేసును కొట్టివేస్తూ పిటిషనర్ అయిన నటి జుహీ చావ్లాకు రూ.20 లక్షలు జరిమానా విధించారు. ప్రచారం కోసమే పిటిషన్ వేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : మహిళపై గ్యాంగ్రేప్.. జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు..!