2002 గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రెండు వారాల తర్వాత తదుపరి విచారణపై ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. పిటిషనర్ వినతి మేరకే విచారణను వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.
క్లీన్చిట్ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
ఇదీ చదవండి : ఈసీ నిషేధంపై దీదీ నిరసన