గుజరాత్లోని నరోలిలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడో కిరాతకుడు. అనంతరం పాప మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టి బాత్రూం కిటికీ నుంచి బయటకు విసిరాడు. తమ బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
చిన్నారి కుటుంబం దాద్రా నగర్ హవేలీ నరోలి గ్రామ సొసైటీలో నివాసముంటోంది. ఆడుకోవడానికి వెళ్లిన పాప చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. ఎంతకూ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అపార్ట్మెంట్ టాయిలెట్ పైప్లైన్ పక్కనే ఉన్న ఓ బ్యాగులో పాప మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఆ సొసైటీలోని 40 ప్లాట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ నెెం 109లో రక్తపు మరకలు కనిపించడం, బాత్రూం కిటికీ పగలి ఉండటం గమనించిన పోలీసులు అందులో నివసిస్తున్న యువకుడిని అరెస్టు చేశారు.
పాపను చంపి మృతదేహాన్ని బ్యాగులో పెట్టి బాత్రూం కిటికీ నుంచి బయటకు విసిరినట్లు నిందితుడు సంతోష్ రజత్ అంగీకరించాడు. పాప ఆడుకుంటుండగా ఎవరూ లేని సమయంలో ఎత్తుకెళ్లాడు. నిందితుడు గతంలోనూ తమతో దురుసుగా ప్రవర్తించాడని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.
ఈ ఘటన గురించి తెలిసిన అనంతరం పాప కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారి తండ్రి ఈ దారుణాన్ని తట్టుకోలేక పినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి: అసోంలో రూ.31 కోట్ల నగదు, బంగారం స్వాధీనం