ETV Bharat / bharat

కొంపముంచిన ఆన్​లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్​ రేప్​

author img

By

Published : Jan 22, 2021, 8:49 AM IST

ఆన్​లైన్​లో స్నేహం ఓ మైనర్ జీవితాన్ని చిదిమేసింది. స్నేహితులుగా నమ్మించి బాలికపై రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Friendship from online chat: 5 raped minor girl
కొంపముంచిన ఆన్​లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్​ రేప్​

స్నేహం ముసుగులో ఓ మైనర్​పై రెండు సార్లు సామూహిక అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను బెంగళూరు హనుమంతనగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Friendship from online chat: 5 raped minor girl
నిందితులు వీళ్లే

ఏం జరిగింది?

ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేశ్​.. 10వ తరగతి చదువుతున్నాడు. కార్పెంటర్​గా పనిచేస్తున్నాడు. ఇన్​స్టాగ్రామ్​లో ఓ మైనర్​ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇరువురు ఫోన్​ నెంబర్లు సైతం తీసుకున్నారు. వెంకటేశ్.. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. నవంబర్ 8న వెంకటేశ్.. తన స్నేహితులతో కలిసి కారులో బాలికను పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ వెంకటేశ్​తో పాటు మరో ఇద్దరు బాలికపై అత్యాచారం చేసి.. ఇంట్లో వదిలివెళ్లారు. అయితే పరువు పోతుందని బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.

అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో..

ఆ తరువాత ఆన్​లైన్​ క్లాసుల పేరుతో వెంకటేశ్​తో ఆన్​లైన్​లో చాటింగ్​ చేసేదా బాలిక. నిందితుడు గుత్తహళ్లీలోని తన స్నేహితుడి ఇంటికి జనవరి 18 అర్ధరాత్రి రప్పించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కనపడటం లేదంటూ ఆమె అమ్మమ్మ, తాతయ్య స్థానికంగా పెట్రోలింగ్​ చేస్తున్న పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ పోలీస్​ అధికారి వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ బృందం వెంటనే గాలింపు జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీళ్లు కే.జే నగర్​కు చెందిన వెంకటేశ్, చేతన్, లేఖన్, రక్షక్​, అభిషేక్​లుగా గుర్తించారు. మరో నిందితుడు బాబు కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి : కర్ణాటకలో పేలుడు- ఎనిమిది మంది మృతి!

స్నేహం ముసుగులో ఓ మైనర్​పై రెండు సార్లు సామూహిక అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను బెంగళూరు హనుమంతనగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Friendship from online chat: 5 raped minor girl
నిందితులు వీళ్లే

ఏం జరిగింది?

ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేశ్​.. 10వ తరగతి చదువుతున్నాడు. కార్పెంటర్​గా పనిచేస్తున్నాడు. ఇన్​స్టాగ్రామ్​లో ఓ మైనర్​ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇరువురు ఫోన్​ నెంబర్లు సైతం తీసుకున్నారు. వెంకటేశ్.. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. నవంబర్ 8న వెంకటేశ్.. తన స్నేహితులతో కలిసి కారులో బాలికను పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ వెంకటేశ్​తో పాటు మరో ఇద్దరు బాలికపై అత్యాచారం చేసి.. ఇంట్లో వదిలివెళ్లారు. అయితే పరువు పోతుందని బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.

అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో..

ఆ తరువాత ఆన్​లైన్​ క్లాసుల పేరుతో వెంకటేశ్​తో ఆన్​లైన్​లో చాటింగ్​ చేసేదా బాలిక. నిందితుడు గుత్తహళ్లీలోని తన స్నేహితుడి ఇంటికి జనవరి 18 అర్ధరాత్రి రప్పించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కనపడటం లేదంటూ ఆమె అమ్మమ్మ, తాతయ్య స్థానికంగా పెట్రోలింగ్​ చేస్తున్న పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ పోలీస్​ అధికారి వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ బృందం వెంటనే గాలింపు జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీళ్లు కే.జే నగర్​కు చెందిన వెంకటేశ్, చేతన్, లేఖన్, రక్షక్​, అభిషేక్​లుగా గుర్తించారు. మరో నిందితుడు బాబు కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి : కర్ణాటకలో పేలుడు- ఎనిమిది మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.