ETV Bharat / bharat

కరోనాతో మాజీ ఎంపీ మహవీర్​ కన్నుమూత - మహవీర్ భాగోరా మృతిపై గవర్నర్​ కల్రాజ్​ మిశ్రా సంతాపం

కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాజపా నేత, మాజీ ఎంపీ మహవీర్​ భాగోరా కన్నుమూశారు. ఆయన మృతిపై రాష్ట్ర గవర్నర్​ కల్రాజ్​ మిశ్రా సంతాపం తెలిపారు. పుదుచ్చేరి ఎమ్మెల్యే కేజీ శంకర్ గుండెపోటుతో మృతి చెందగా.. ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ​

Former BJP MP Mahaveer Bhagora dies with Covid-19
భాజపా మాజీ ఎంపీ మహవీర్​ భాగోరా కన్నుమూత
author img

By

Published : Jan 17, 2021, 8:07 PM IST

రాజస్థాన్​కు చెందిన భాజపా నేత, మాజీ పార్లమెంట్​ సభ్యులు మహవీర్​ భాగోరా(73) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఉదయ్​పుర్​ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్టు స్థానిక భాజపా అధ్యక్షుడు రవీంద్ర శ్రీమాళి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఖేవారా ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

2004-09 మధ్యకాలంలో సాలుంబర్​ భాజపా ఎంపీగా సేవలందించారు భాగోరా. అంతకముందు 1993-98 వరకు ఎమ్మెల్యేగానూ పనిచేశారు.

భాగోరా మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్​ కల్రాజ్​ మిశ్రా సంతాపం తెలిపారు.

పుదుచ్చేరి ఎమ్మెల్యే మృతిపై మోదీ సంతాపం..

పుదుచ్చేరి ఎమ్మెల్యే, భాజపా నేత కేజీ శంకర్​(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పుదుచ్చేరి అభివృద్ధిలో, పార్టీని బలోపేతం చేయడంలో శంకర్​ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

రాజస్థాన్​కు చెందిన భాజపా నేత, మాజీ పార్లమెంట్​ సభ్యులు మహవీర్​ భాగోరా(73) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఉదయ్​పుర్​ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్టు స్థానిక భాజపా అధ్యక్షుడు రవీంద్ర శ్రీమాళి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఖేవారా ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

2004-09 మధ్యకాలంలో సాలుంబర్​ భాజపా ఎంపీగా సేవలందించారు భాగోరా. అంతకముందు 1993-98 వరకు ఎమ్మెల్యేగానూ పనిచేశారు.

భాగోరా మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్​ కల్రాజ్​ మిశ్రా సంతాపం తెలిపారు.

పుదుచ్చేరి ఎమ్మెల్యే మృతిపై మోదీ సంతాపం..

పుదుచ్చేరి ఎమ్మెల్యే, భాజపా నేత కేజీ శంకర్​(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పుదుచ్చేరి అభివృద్ధిలో, పార్టీని బలోపేతం చేయడంలో శంకర్​ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.