Fire Accident in House: ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ జిల్లా శతాబ్దిపురం ప్రాంతంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మరణించారు. ఘటనా సమయంలో ఇంట్లో ఉన్న తల్లి.. ముగ్గురు పిల్లలను కాపాడగా.. మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు.

కారణమిదే..!
కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శతాబ్దిపురంలో ఓ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కుటుంబ యజమాని పని కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో తల్లి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఏమైందో తెలియదుగానీ.. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన తల్లి.. ముగ్గురు చిన్నారులను కాపాడింది. ఈ క్రమంలో మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్, సిలిండర్ లీక్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి