ETV Bharat / bharat

'ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా '

తృణమూల్​ కాంగ్రెస్​పై సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు దశాబ్దాలకు పైగా ఆ పార్టీలో భాగమైనందుకు సిగ్గు పడ్తున్నానన్నారు. టీఎంసీని కంపెనీతో పోల్చారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

author img

By

Published : Dec 26, 2020, 7:24 PM IST

Feeling ashamed to be part of Trinamool for 21 years: Suvendu
'ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడ్తున్నా'

తృణమూల్​ కాంగ్రెస్​పై.. బంగాల్​ మాజీ మంత్రి సువేంధు అధికారి మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 21ఏళ్ల పాటు ఆ పార్టీలో భాగమైనందుకు నిజంగా సిగ్గు పడుతున్నానని తెలిపారు. అంతేకాక, టీఎంసీ ఒక కంపెనీ అని.. పార్టీలో అసలు క్రమశిక్షణకు తావులేదన్నారు.

21ఏళ్లుగా ఆ(టీఎంసీ) పార్టీలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ అసలు ఉండదు. అదొక కంపెనీ లాంటిది. ఇటీవలే నేను ఆ కంపెనీ నుంచి బయటికొచ్చి.. సరైన రాజకీయ పార్టీలో చేరాను. తృణమూల్ పాలన 'పార్టీ కోసం' మాత్రమే అనే సంస్కృతిని బంగాల్​ ప్రజలకు అలవర్చింది. అంతకు ముందు 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఐ-ఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మమతా పాలన కొనసాగింపు.

-సువేందు అధికారి, బంగాల్ మాజీ మంత్రి.

భాజపా మాత్రమే 'ప్రజల కోసం' అనే సంస్కృతిని అలవర్చుకుందని సువేందు తెలిపారు. మనకు నిజమైన ఆర్థిక సంస్కరణలు కావాలన్నా.. ఉద్యోగ అవకాశాలు రావాలన్నా.. కమలం పార్టీతో కలిసి సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. బంగాల్​లోనూ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​తో కలిసి సువేందు.. రాష్ట్రంలో మరణించిన 135మంది కాషాయ కార్యకర్తలకు నివాళులు అర్పించారు. 'సోనార్ బంగ్లా' అనే నినాదం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని కమలం కార్యకర్తలను ఆయన కోరారు.

తృణమూల్​ కాంగ్రెస్​పై.. బంగాల్​ మాజీ మంత్రి సువేంధు అధికారి మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 21ఏళ్ల పాటు ఆ పార్టీలో భాగమైనందుకు నిజంగా సిగ్గు పడుతున్నానని తెలిపారు. అంతేకాక, టీఎంసీ ఒక కంపెనీ అని.. పార్టీలో అసలు క్రమశిక్షణకు తావులేదన్నారు.

21ఏళ్లుగా ఆ(టీఎంసీ) పార్టీలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ అసలు ఉండదు. అదొక కంపెనీ లాంటిది. ఇటీవలే నేను ఆ కంపెనీ నుంచి బయటికొచ్చి.. సరైన రాజకీయ పార్టీలో చేరాను. తృణమూల్ పాలన 'పార్టీ కోసం' మాత్రమే అనే సంస్కృతిని బంగాల్​ ప్రజలకు అలవర్చింది. అంతకు ముందు 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఐ-ఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మమతా పాలన కొనసాగింపు.

-సువేందు అధికారి, బంగాల్ మాజీ మంత్రి.

భాజపా మాత్రమే 'ప్రజల కోసం' అనే సంస్కృతిని అలవర్చుకుందని సువేందు తెలిపారు. మనకు నిజమైన ఆర్థిక సంస్కరణలు కావాలన్నా.. ఉద్యోగ అవకాశాలు రావాలన్నా.. కమలం పార్టీతో కలిసి సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. బంగాల్​లోనూ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​తో కలిసి సువేందు.. రాష్ట్రంలో మరణించిన 135మంది కాషాయ కార్యకర్తలకు నివాళులు అర్పించారు. 'సోనార్ బంగ్లా' అనే నినాదం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని కమలం కార్యకర్తలను ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.