dispute over dog barking: పక్కింటి పెంపుడు కుక్క మొరుగుతోందని ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబంపై కాల్పులు జరిపారు. ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్లోని బాపూధామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెంపుడు కుక్క యజమానితో పాటు అతడి ఇద్దరు కుమారులపై నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. నిందితులను అఠన్నీ, చవాన్నీగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

బాధితుడు సుశీల్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, కుక్క పదేపదే అరుస్తోందని నిందితులు తరచుగా కోప్పడేవారు. ఇదే విషయంలో మంగళవారం గొడవ జరగ్గా.. నిందితులు సుశీల్పై కాల్పులు చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చాక్లెట్ కోసం డబ్బులిచ్చి మరో ఘటనలో..