ETV Bharat / bharat

Family Committed Suicide: బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 9:07 AM IST

Updated : Sep 12, 2023, 1:03 PM IST

Family_Committed_Suicide
Family_Committed_Suicide

09:04 September 12

భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి

Family_Committed_Suicide
Family_Committed_Suicide

Family Committed Suicide: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మర్రిపాలెం ఎఫ్‌సీఐ నగర్‌కు చెందిన ఎం.డీ.మొహినుద్దీన్‌, అతడి భార్య, కుమార్తె.. నిన్న సాయంత్రం చింతలపాలెంలోని తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అయితే క్యాబ్​లో అక్కడికి చేరుకున్న అనంతరం వారు.. కుమారుడు ఆలీకి ఫోన్ చేసి.. తాముు ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో భర్త ఎం.డీ.మొహినుద్దీన్‌(46), భార్య సంఘనిషా(39), కుమార్తె ఫాతిమా జహీరా(17) మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్త వలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

09:04 September 12

భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి

Family_Committed_Suicide
Family_Committed_Suicide

Family Committed Suicide: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మర్రిపాలెం ఎఫ్‌సీఐ నగర్‌కు చెందిన ఎం.డీ.మొహినుద్దీన్‌, అతడి భార్య, కుమార్తె.. నిన్న సాయంత్రం చింతలపాలెంలోని తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అయితే క్యాబ్​లో అక్కడికి చేరుకున్న అనంతరం వారు.. కుమారుడు ఆలీకి ఫోన్ చేసి.. తాముు ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో భర్త ఎం.డీ.మొహినుద్దీన్‌(46), భార్య సంఘనిషా(39), కుమార్తె ఫాతిమా జహీరా(17) మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్త వలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Last Updated : Sep 12, 2023, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.