ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: వారికి ఫ్రీగా స్మార్ట్​​ ఫోన్లు

లాక్​డౌన్​ కారణంగా ఆన్​లైన్​ చదువులకు దూరమై.. రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముకుంటున్న ముగ్గురు పిల్లలపై ఈటీవీ భారత్​ కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఝార్ఖండ్​లోని ఓ గ్రామానికి చెందిన ఈ చిన్నారులకు సాయం చేయడానికి ఘాటిశీల ఎమ్మెల్యే రాందాస్​ సోరెన్​ ముందుకొచ్చారు. వారికి ఆండ్రాయిడ్​ ఫోన్లు అందజేశారు.

author img

By

Published : Jun 11, 2021, 5:26 PM IST

etv bharat impact
ఈటీవీ భారత్ కథనానికి స్పందన
ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల చదువులకు దూరమైన ఝార్ఖండ్​ తూర్పు సింహభూమ్​ జిల్లాకు చెందిన ముగ్గురు పిల్లలకు ఎమ్మెల్యే రాందాస్​ సోరెన్​.. ఆండ్రాయిడ్​ ఫోన్లు అందజేశారు. ముసాబని బ్లాక్​లోని రోమ్​ గ్రామానికి చెందిన ఆ పిల్లలు.. ఆన్​లైన్​ చదువుల కోసం ఫోన్లు కొనుగోలు చేయలనే ఉద్దేశంతో ముసాబని-జడుగోడ మెయిన్​ రోడ్డు పక్కన మామిడిపళ్లు విక్రయిస్తున్నారు. వీరిపై ఈటీవీ భారత్​ కథనానికి ఘాటిశీల నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్​ అనూహ్యంగా స్పందించారు​.

ఫోన్లు కొనేందుకు పళ్లు అమ్మకం

సోరెన్​ తన పార్టీ కార్యకర్తలను ఆ గ్రామానికి పంపించి.. ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా పాఠశాల మూసివేశారని, పిల్లలందరూ ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే కూలీ పని చేసుకుని బతికే తమకు ఆండ్రాయిడ్​ ఫోన్లు కొనే స్తోమత లేదని చెప్పుకొచ్చారు. పిల్లలకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉందని.. ఫోన్లు కొనేందుకు కావాల్సిన డబ్బు సంపాందించడానికి రోడ్డుపక్కన మామిడి పళ్లు అమ్ముతున్నారని తెలిపారు.

etv bharat impact
మామిడి పళ్లు అమ్ముతున్న చిన్నారులు
etv bharat impact
ఫోన్లు అందుకున్న ఆనందంలో చిన్నారులు

ఝార్ఖండ్​ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు.. ఈ వివరాలన్నీ రాందాస్ ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన రాందాస్​.. వారికి ఆండ్రాయిడ్​ ఫోన్లు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలను తన నివాసానికి పిలిపించి.. ఫోన్లు అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఆన్‌లైన్‌ తరగతలకు హాజరవుతామని చెప్పారు. చిన్నారులకు ఫోన్లు అందజేసినందుకు వారి తల్లిదండ్రులు.. ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, తన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'!

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల చదువులకు దూరమైన ఝార్ఖండ్​ తూర్పు సింహభూమ్​ జిల్లాకు చెందిన ముగ్గురు పిల్లలకు ఎమ్మెల్యే రాందాస్​ సోరెన్​.. ఆండ్రాయిడ్​ ఫోన్లు అందజేశారు. ముసాబని బ్లాక్​లోని రోమ్​ గ్రామానికి చెందిన ఆ పిల్లలు.. ఆన్​లైన్​ చదువుల కోసం ఫోన్లు కొనుగోలు చేయలనే ఉద్దేశంతో ముసాబని-జడుగోడ మెయిన్​ రోడ్డు పక్కన మామిడిపళ్లు విక్రయిస్తున్నారు. వీరిపై ఈటీవీ భారత్​ కథనానికి ఘాటిశీల నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్​ అనూహ్యంగా స్పందించారు​.

ఫోన్లు కొనేందుకు పళ్లు అమ్మకం

సోరెన్​ తన పార్టీ కార్యకర్తలను ఆ గ్రామానికి పంపించి.. ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా పాఠశాల మూసివేశారని, పిల్లలందరూ ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే కూలీ పని చేసుకుని బతికే తమకు ఆండ్రాయిడ్​ ఫోన్లు కొనే స్తోమత లేదని చెప్పుకొచ్చారు. పిల్లలకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉందని.. ఫోన్లు కొనేందుకు కావాల్సిన డబ్బు సంపాందించడానికి రోడ్డుపక్కన మామిడి పళ్లు అమ్ముతున్నారని తెలిపారు.

etv bharat impact
మామిడి పళ్లు అమ్ముతున్న చిన్నారులు
etv bharat impact
ఫోన్లు అందుకున్న ఆనందంలో చిన్నారులు

ఝార్ఖండ్​ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు.. ఈ వివరాలన్నీ రాందాస్ ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన రాందాస్​.. వారికి ఆండ్రాయిడ్​ ఫోన్లు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలను తన నివాసానికి పిలిపించి.. ఫోన్లు అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఆన్‌లైన్‌ తరగతలకు హాజరవుతామని చెప్పారు. చిన్నారులకు ఫోన్లు అందజేసినందుకు వారి తల్లిదండ్రులు.. ఎమ్మెల్యే రాందాస్ సోరెన్, తన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.