ETV Bharat / bharat

కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​.. అడ్డంగా బుక్కైన నిందితులు.. సీఎం ప్రశంసలు

author img

By

Published : Apr 15, 2022, 10:55 AM IST

Drugs seized in Assam: సరిహద్దు ప్రాంతాల గుండా మాదక ద్రవ్యాలను చేరవేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. ఓ ట్రక్కులో భారీగా డ్రగ్స్​ తరలిస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

Assam Police Seize Drugs
డ్రగ్స్​ సీజ్​

Drugs seized in Assam: అంతరాష్ట్ర డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు అసోంలోని కాచర్​ జిల్లా పోలీసులు. జిరిఘాట్​ ప్రాంతంలో సుమారు రూ.42 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు కామరూప్​ స్టేషన్​ పోలీసులు తెలిపారు. పట్టుకున్న డ్రగ్స్​లో అర కిలో హెరాయిన్​, 1.5 లక్షల యాబా మాత్రలు ఉన్నట్లు చెప్పారు.

Assam Police Seize Drugs
అసోం పోలీసులు పట్టుకున్న డ్రగ్స్​

జాయింట్​ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ పార్థ సారధి మహంతా నేతృత్వంలో జిల్లాలోని సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఓ ట్రక్కును తనిఖీ చేయగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అరెస్ట్​ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఫిరోఖాన్​, ఎలియాస్​ ఖాన్​లు సరిహద్దు రాష్ట్రం మణిపుర్​కు చెందిన వారు కాగా.. సద్దామ్​ అలియాస్​ సమినుల్​ హఖ్​ బంగాల్​లోని కూచ్​ బిహార్​ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Assam Police Seize Drugs
పట్టుకున్న మాదకద్రవ్యాలు

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. 'జేసీపీ పార్థ సారధి మహంత, డీఎస్​పీ కల్యాణ్​ పాఠక్​ నేతృత్వంలో మరో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. కాచర్​ సరిహద్దులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకున్నారు. 0.5 కిలోల హెరాయిన్​, 1.5 లక్షల యాబా ట్యాబ్లెట్లు సీజ్​ చేశారు.' అని పేర్కొన్నారు.

  • #AssamAgainstDrugs

    In an operation led by JCP Partha Mahanta and DSP Kalyan Pathak, another interstate drug network has been busted. Two accused from other states have been apprenhended at Cachar border.

    0.5 kg Heroin & 1.5 lakh Ya ba tablets seized.

    Good job @assampolice 👏 pic.twitter.com/x3IZzGYe7s

    — Himanta Biswa Sarma (@himantabiswa) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: రూ.15వేల కోసం బాలికను చంపిన యువకుడు.. ఆపై ఆత్మహత్య

Drugs seized in Assam: అంతరాష్ట్ర డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు అసోంలోని కాచర్​ జిల్లా పోలీసులు. జిరిఘాట్​ ప్రాంతంలో సుమారు రూ.42 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు కామరూప్​ స్టేషన్​ పోలీసులు తెలిపారు. పట్టుకున్న డ్రగ్స్​లో అర కిలో హెరాయిన్​, 1.5 లక్షల యాబా మాత్రలు ఉన్నట్లు చెప్పారు.

Assam Police Seize Drugs
అసోం పోలీసులు పట్టుకున్న డ్రగ్స్​

జాయింట్​ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ పార్థ సారధి మహంతా నేతృత్వంలో జిల్లాలోని సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఓ ట్రక్కును తనిఖీ చేయగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అరెస్ట్​ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఫిరోఖాన్​, ఎలియాస్​ ఖాన్​లు సరిహద్దు రాష్ట్రం మణిపుర్​కు చెందిన వారు కాగా.. సద్దామ్​ అలియాస్​ సమినుల్​ హఖ్​ బంగాల్​లోని కూచ్​ బిహార్​ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Assam Police Seize Drugs
పట్టుకున్న మాదకద్రవ్యాలు

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. 'జేసీపీ పార్థ సారధి మహంత, డీఎస్​పీ కల్యాణ్​ పాఠక్​ నేతృత్వంలో మరో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. కాచర్​ సరిహద్దులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకున్నారు. 0.5 కిలోల హెరాయిన్​, 1.5 లక్షల యాబా ట్యాబ్లెట్లు సీజ్​ చేశారు.' అని పేర్కొన్నారు.

  • #AssamAgainstDrugs

    In an operation led by JCP Partha Mahanta and DSP Kalyan Pathak, another interstate drug network has been busted. Two accused from other states have been apprenhended at Cachar border.

    0.5 kg Heroin & 1.5 lakh Ya ba tablets seized.

    Good job @assampolice 👏 pic.twitter.com/x3IZzGYe7s

    — Himanta Biswa Sarma (@himantabiswa) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: రూ.15వేల కోసం బాలికను చంపిన యువకుడు.. ఆపై ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.