ETV Bharat / bharat

ఆర్యన్​ ఖాన్​ విడుదలకు 14 షరతులు- ఆ పనులు చేయకూడదు!

author img

By

Published : Oct 29, 2021, 5:55 PM IST

డ్రగ్స్​ కేసులో అరెస్టయిన షారుక్​ ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​కు గురువారం బెయిల్​ లభించింది. 14 షరతులతో కూడిన బెయిల్​ ఆర్డర్​ను శుక్రవారం జారీ చేసింది కోర్టు.

HC orders Aryan to furnish Rs one lakh personal bond
HC orders Aryan to furnish Rs one lakh personal bond

క్రూయిజ్​ షిప్​ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. బెయిల్​కు సంబంధించి మొత్తం 14 షరతులు విధిస్తూ పూర్తి స్థాయి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది.

రూ. లక్ష రూపాయల పర్సనల్​ బాండ్​తో పాటు.. అంతే మొత్తంలో ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. 5 పేజీల బెయిల్​ ఆర్డర్​పై జస్టిస్​ ఎన్​డబ్ల్యూ సాంబ్రే శుక్రవారం మధ్యాహ్నం సంతకం చేశారు.

బెయిల్​ షరతులు ఇవే..

  • రూ. లక్ష పర్సనల్​ బాండ్​
  • ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు
  • ప్రత్యేక కోర్టుకు పాస్​పోర్ట్ అప్పగించాలి.​
  • కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.
  • మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు.
  • సహ నిందితులతో మాట్లాడటం, కలవడం చేయకూడదు.
  • ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11-2 గంటల సమయంలో.. ముంబయి ఎన్​సీబీ కార్యాలయానికి రావాలి.

ఆర్యన్​తో పాటు అర్బాజ్​ మర్చంట్​, మున్మున్​ ధమేచాకు కూడా బెయిల్​ లభించింది. ప్రస్తుతం వీరు ముంబయి ఆర్థర్​ రోడ్​ జైలులో ఉన్నారు. క్రూయిజ్​ షిప్​పై దాడి చేసి ఎన్​సీబీ వీరిని 25 రోజుల కింద అరెస్టు చేసింది.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్​

క్రూయిజ్​ షిప్​ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. బెయిల్​కు సంబంధించి మొత్తం 14 షరతులు విధిస్తూ పూర్తి స్థాయి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది.

రూ. లక్ష రూపాయల పర్సనల్​ బాండ్​తో పాటు.. అంతే మొత్తంలో ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. 5 పేజీల బెయిల్​ ఆర్డర్​పై జస్టిస్​ ఎన్​డబ్ల్యూ సాంబ్రే శుక్రవారం మధ్యాహ్నం సంతకం చేశారు.

బెయిల్​ షరతులు ఇవే..

  • రూ. లక్ష పర్సనల్​ బాండ్​
  • ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు
  • ప్రత్యేక కోర్టుకు పాస్​పోర్ట్ అప్పగించాలి.​
  • కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.
  • మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు.
  • సహ నిందితులతో మాట్లాడటం, కలవడం చేయకూడదు.
  • ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11-2 గంటల సమయంలో.. ముంబయి ఎన్​సీబీ కార్యాలయానికి రావాలి.

ఆర్యన్​తో పాటు అర్బాజ్​ మర్చంట్​, మున్మున్​ ధమేచాకు కూడా బెయిల్​ లభించింది. ప్రస్తుతం వీరు ముంబయి ఆర్థర్​ రోడ్​ జైలులో ఉన్నారు. క్రూయిజ్​ షిప్​పై దాడి చేసి ఎన్​సీబీ వీరిని 25 రోజుల కింద అరెస్టు చేసింది.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.