ETV Bharat / bharat

రూ. 42కోట్లు విలువ చేసే బంగారం-వెండి సీజ్ - భారీ బంగారం సీజ్​ చేసిన డీఆర్​ఐ

రూ. 42 కోట్లు విలువ చేసే బంగారం-వెండిని సీజ్​ చేశారు అధికారులు. రాయ్​పుర్, ఇందోర్ డీఆర్ఐ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి.

raipur DRI
డీఆర్​ఐ
author img

By

Published : May 4, 2021, 10:54 AM IST

రాయ్​పుర్, ఇందోర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 42 కోట్లు విలువ చేసే బంగారం-వెండి బిస్కెట్లను సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

తొలుత రాయ్​పుర్​లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న డీఆర్​ఐ బృందాలు.. రాజనందగావ్​లోని మోహిని జ్యువెల్లర్స్​లోను సోదాలు చేశాయి. రాయ్​పుర్​లో 13కేజీల బంగారం స్వాధీనం చేసుకొని, మోహిని జ్యువెల్లర్స్ నుంచి 4,545 కేజీల వెండి, నాలుగున్నర కేజీల బంగారం, రూ. 32లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నాయి.

రాయ్​పుర్​కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు 13 కేజీల బంగారాన్ని కోల్​కతా నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మంత్రే అంబులెన్సు డ్రైవర్​గా మారి..

రాయ్​పుర్, ఇందోర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 42 కోట్లు విలువ చేసే బంగారం-వెండి బిస్కెట్లను సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

తొలుత రాయ్​పుర్​లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న డీఆర్​ఐ బృందాలు.. రాజనందగావ్​లోని మోహిని జ్యువెల్లర్స్​లోను సోదాలు చేశాయి. రాయ్​పుర్​లో 13కేజీల బంగారం స్వాధీనం చేసుకొని, మోహిని జ్యువెల్లర్స్ నుంచి 4,545 కేజీల వెండి, నాలుగున్నర కేజీల బంగారం, రూ. 32లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నాయి.

రాయ్​పుర్​కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు 13 కేజీల బంగారాన్ని కోల్​కతా నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మంత్రే అంబులెన్సు డ్రైవర్​గా మారి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.