Dream11 Jackpot Winner : ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఓ యువకుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఫాంటసీ క్రికెట్ గేమ్లో జాక్పాట్ కొట్టాడు. రూ.49 పెట్టి డ్రీమ్-11 యాప్లో గేమ్ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు.
బిహార్, అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామంలో సాదిక్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు స్థానికంగా ఉండే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు. క్రికెట్పై ఆసక్తి ఉన్న సాదిక్ జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్ మ్యాచ్లో రూ.49 పెట్టి డ్రీమ్-11లో ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
"ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్లో రూ.49తో గేమ్ ఆడాను. మిలియనీర్ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది."
-- సాదిక్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్
సాదిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి ఏకంగా డ్రీమ్-11 గేమ్ టాలీ బోర్డ్లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు. కానీ ఈ విషయం చెబితే సాదిక్ను ఎవరూ నమ్మలేదు. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాదిక్ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సాదిక్ను అభినందించేందుకు బంధువులు అతడి ఇంటికి చేరుకుంటున్నారు.
మరోవైపు, ఈ విషయంపై సాదిక్ పని చేసే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్ స్పందించారు. సాదిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని తెలిపారు.
జాక్పాట్ వరించింది- ఉద్యోగం ఊడింది!
గతేడాది అక్టోబర్లో మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్కు చెందిన ఎస్ఐ సోమ్నాథ్ జెండే డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషంలో ముగిపోయింది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సోమ్నాథ్ జెండేను ఉన్నతాధికారులు విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి.
డ్రీమ్ 11లో రూ.కోటి జాక్పాట్.. ఫుల్లుగా మందుకొట్టి హల్చల్.. అఖరికి
డ్రీమ్ 11లో ఆటో డ్రైవర్కు జాక్పాట్.. రూ.39తో కోటి సొంతం.. బ్యాంక్ అకౌంట్ లేక..