దేశవ్యాప్తంగా క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. క్రీస్తు జన్మదినం సందర్భంగా చర్చిలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. కేరళ తిరువనంతపురంలోని సెయింట్ జోసెఫ్ మెట్రోపాలిటన్ కేథడ్రాల్లో ప్రార్థనలు చేసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
ఒడిశా భువనేశ్వలోని ఓ చర్చిలో క్రిస్మస్ సంబరాలు చేసుకొనేందుకు పెద్దఎత్తున గుమిగూడారు క్రైస్తవులు.
రాష్ట్రపతి శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించేందుకు ఈ పండుగ దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ, సేవాగుణంతో క్రీస్తు బోధనలను అనుసరించాలని.. తద్వారా దేశ సంక్షేమానికి పాటుపడాలని కోరుతూ ట్వీట్ చేశారు.
"అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ శాంతి, శ్రేయస్సులను పెంపొందించి.. సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను. క్రీస్తు బోధనలను అనుసరించి దేశ సంక్షేమానికి కట్టుబడి ఉందాం."
- రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్
ఇదీ చూడండి: మాస్కుల వాడకంపై 'శాంటాక్లాజ్'తో సందేశం