ETV Bharat / bharat

Delhi Earthquake Today : దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు.. కార్యాలయం నుంచి బయటకొచ్చిన కేంద్రమంత్రి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 3:31 PM IST

Updated : Oct 3, 2023, 5:06 PM IST

Delhi Earthquake Today : దిల్లీలో భారీ భూకంపం సంభవించింది. రాజధానితోపాటు జాతీయ రాజధాని ప్రాంతం-NCRలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌లో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం పేర్కొంది.

Delhi Earthquake Today
Delhi Earthquake Today Time

Delhi Earthquake Today : దేశ రాజధాని దిల్లీని మంగళవారం భారీ భూకంపం వణికించింది. దిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం-NCRలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. నేపాల్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్‌, ఉత్తర్​ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్​, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించింది.

  • #WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.

    As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వెంట వెంటనే భూ ప్రకంపనలు..
మంగళవారం మధ్యాహ్నం 2.25 సమయంలో మొదటిసారి 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ(ఎన్‌సీఎస్‌) గుర్తించింది. ఇది పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఈ తీవ్రతను గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కాగా, దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.2గా రికార్డయింది.

ట్విట్టర్​ వేదికగా పోలీసుల అలర్ట్​..
రెండోసారి ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని దిల్లీ పోలీసులు కోరారు. 'దయచేసి భవన సముదాయాల్లో ఉన్న ప్రతిఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరూ లిఫ్ట్​లు గానీ ఎలివేటర్లు గానీ వినియోగించవద్దని మేము అభ్యర్థిస్తున్నాము. ఎమర్జెన్సీ కోసం 112కు డయల్​ చేయండి' అని ట్విట్టర్​ వేదికగా అభ్యర్థించారు. రెండోసారి సంభవించిన భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు కదలాడాయి.

  • #WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.

    Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బయటకొచ్చిన కేంద్ర మంత్రి..
భూ ప్రకంపనల ధాటికి సెంట్రల్​ దిల్లీలోని నిర్మాణ్​ భవన్​లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్​ మాండవీయ కూడా అధికారులతో కలిసి బయటకు వచ్చారు. మరోవైపు ఉత్తరభారతంలోని జైపుర్​, చండీగఢ్‌ ప్రాంతాల్లోనూ ​ప్రకంపనలు సంభవించాయి. కాగా, ప్రకంపనల కారణంగా ఎంతమేర నష్టం జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

  • #WATCH | Delhi | Union Health Minister Mansukh Mandaviya stepped out of Nirman Bhawan, along with others, as strong tremors hit different parts of north India. pic.twitter.com/8EbNFX4b46

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పశ్చిమ నేపాల్‌లో 4 సార్లు..
పశ్చిమ నేపాల్‌లోనూ గంట వ్యవధిలోనే నాలుగుసార్లు భూమి కంపించినట్లు ఆ దేశ జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. తొలుత 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఖాట్మండుకు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజాంగ్ జిల్లాలోని తల్కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల సమయంలో భూకంపం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే రెండోసారి కూడా 6.3 తీవ్రతతో ఇదే ప్రాంతంలో 3:06 గంటల సమయంలో మరో భూపంకపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తర్వాత మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Modi In Chhattisgarh : 'కాంగ్రెస్​ పాలనలో అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయి'.. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై మోదీ ఫైర్​

IRCTC Punya Kshetra Yatra Details and How to Book Online..?: రూ.16 వేలకే 6 పుణ్యక్షేత్రాల దర్శనం... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. ఎలా బుక్​ చేయాలంటే..?

Delhi Earthquake Today : దేశ రాజధాని దిల్లీని మంగళవారం భారీ భూకంపం వణికించింది. దిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం-NCRలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. నేపాల్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్‌, ఉత్తర్​ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్​, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించింది.

  • #WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.

    As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వెంట వెంటనే భూ ప్రకంపనలు..
మంగళవారం మధ్యాహ్నం 2.25 సమయంలో మొదటిసారి 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ(ఎన్‌సీఎస్‌) గుర్తించింది. ఇది పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఈ తీవ్రతను గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కాగా, దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.2గా రికార్డయింది.

ట్విట్టర్​ వేదికగా పోలీసుల అలర్ట్​..
రెండోసారి ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని దిల్లీ పోలీసులు కోరారు. 'దయచేసి భవన సముదాయాల్లో ఉన్న ప్రతిఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరూ లిఫ్ట్​లు గానీ ఎలివేటర్లు గానీ వినియోగించవద్దని మేము అభ్యర్థిస్తున్నాము. ఎమర్జెన్సీ కోసం 112కు డయల్​ చేయండి' అని ట్విట్టర్​ వేదికగా అభ్యర్థించారు. రెండోసారి సంభవించిన భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు కదలాడాయి.

  • #WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.

    Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బయటకొచ్చిన కేంద్ర మంత్రి..
భూ ప్రకంపనల ధాటికి సెంట్రల్​ దిల్లీలోని నిర్మాణ్​ భవన్​లో ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్​ మాండవీయ కూడా అధికారులతో కలిసి బయటకు వచ్చారు. మరోవైపు ఉత్తరభారతంలోని జైపుర్​, చండీగఢ్‌ ప్రాంతాల్లోనూ ​ప్రకంపనలు సంభవించాయి. కాగా, ప్రకంపనల కారణంగా ఎంతమేర నష్టం జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

  • #WATCH | Delhi | Union Health Minister Mansukh Mandaviya stepped out of Nirman Bhawan, along with others, as strong tremors hit different parts of north India. pic.twitter.com/8EbNFX4b46

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పశ్చిమ నేపాల్‌లో 4 సార్లు..
పశ్చిమ నేపాల్‌లోనూ గంట వ్యవధిలోనే నాలుగుసార్లు భూమి కంపించినట్లు ఆ దేశ జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. తొలుత 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఖాట్మండుకు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజాంగ్ జిల్లాలోని తల్కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల సమయంలో భూకంపం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే రెండోసారి కూడా 6.3 తీవ్రతతో ఇదే ప్రాంతంలో 3:06 గంటల సమయంలో మరో భూపంకపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తర్వాత మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Modi In Chhattisgarh : 'కాంగ్రెస్​ పాలనలో అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయి'.. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై మోదీ ఫైర్​

IRCTC Punya Kshetra Yatra Details and How to Book Online..?: రూ.16 వేలకే 6 పుణ్యక్షేత్రాల దర్శనం... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. ఎలా బుక్​ చేయాలంటే..?

Last Updated : Oct 3, 2023, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.