Covid vaccination: దేశంలో ఇప్పటికే శరవేగంగా సాగుతున్న టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. వ్యాక్సినేషన్ పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు ఈ నెల 16 నుంచే.. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయా తెలిపారు. వారికి హైదరాబాద్కు చెందిన 'బయోలాజికల్ ఈ' సంస్థ అభివృద్ధి చేసిన.. కార్బెవ్యాక్స్ను అందించనున్నట్లు సమాచారం.
60ఏళ్లు దాటిన అందరికీ ప్రికాషన్ డోసు పంపిణీ చేయనున్నట్లు మాండవీయా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
- గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్లైన్ వర్కర్స్కు (ఎఫ్ఎల్డబ్ల్యూ) టీకాలు పంపిణీ ప్రారంభించారు.
- కరోనా టీకా తదుపరి దశను మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వారికి.. 45 పైబడిన వారికి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- దేశంలో 2021 ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు.
- 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గత ఏడాది మే 1 నుంచి టీకాలు వేయడానికి అనుమతించడం ద్వారా టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించింది.
- కరోనా టీకా తదుపరి దశను ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయసున్నవారికి టీకా పంపీణీ ప్రారంభించారు.
ఇదీ చూ డండి: లిఫ్ట్లో 13 మంది.. రెండున్నర గంటల నరకం.. చివరకు సాహసం!