మహారాష్ట్రలో కరోనా కేసులు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 55,469 మందికి వైరస్ సోకింది. మరో 297 మంది మహమ్మారితో చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31 లక్షల 13 వేలు దాటగా.. 56 వేల మందికి పైగా మరణించారు. వీటిలో ముంబయిలోనే 10,030 కేసులు వెలుగుచూశాయని.. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 6,150 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 26 వేలు దాటింది.
దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా 5,100 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ ఏడాదిలో రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. కాగా మరో 17 మంది చనిపోయారు.
- మధ్యప్రదేశ్లో మరో 3,722 మంది కొవిడ్ బారిన పడగా.. 18 మంది చనిపోయారు.
- గుజరాత్లో రోజువారి కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 3,280 మందికి కరోనా సోకగా.. 17 మంది చనిపోయారు.
- పంజాబ్లో కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 62 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో మరో 2,924 మందికి వైరస్ సోకింది.
- రాజస్థాన్లో తాజాగా 2,236 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 13 మంది మరణించారు.
- హరియాణాలో కొత్తగా 2,099 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలగా.. మరో 9 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి: పీపీఈ కిట్ ధరించి.. ఓటు వేసిన ఎంపీ కనిమొళి