ETV Bharat / bharat

'వారసత్వ రాజకీయాల వల్లే కాంగ్రెస్​ పతనం'

author img

By

Published : Feb 28, 2021, 2:46 PM IST

వారసత్వ రాజకీయాల కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ పతనమవుతోందని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. పుదుచ్చేరి నుంచి రూ.15వేల కోట్ల అవినీతి సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపించారు.

Congress collapsing across India due to dynasty politics, says Amit Shah
వారసత్వ రాజకీయాల వల్లే కాంగ్రెస్​ పతనం: షా

కాంగ్రెస్​ వారసత్వ రాజకీయాల కారణంగా దేశవ్యాప్తంగా కుప్పకూలిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో ఆ పార్టీ అవినీతికి పాల్పడి.. రూ.15వేల కోట్ల సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపణలు చేశారు.

పుదుచ్చేరిలో భాజపా ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై ధ్వజమెత్తారు షా. పుదుచ్చేరిలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్​.. ప్రభుత్వ పథకాలపై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. తన పాలనా కాలంలో అభివృద్ధి పనుల కన్నా.. గాంధీ కుటుంబానికి సేవ చేయడం, అవినీతి సొమ్మును తరలించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని ఆరోపించారు. ఎంతో మంది సీనియర్​ నాయకులు కాంగ్రెస్​ను వీడుతున్నారని.. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా పతనం దిశగా సాగుతోందన్నారు.

దేశంలో అంకితభావంతో కూడిన మత్స్య శాఖ లేదన్న రాహుల్​ వ్యాఖ్యలపైనా తీవ్రంగా మండిపడ్డారు షా. రెండేళ్ల క్రితమే మోదీ హయాంలో ఇది ఏర్పాటైందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?

కాంగ్రెస్​ వారసత్వ రాజకీయాల కారణంగా దేశవ్యాప్తంగా కుప్పకూలిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో ఆ పార్టీ అవినీతికి పాల్పడి.. రూ.15వేల కోట్ల సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపణలు చేశారు.

పుదుచ్చేరిలో భాజపా ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై ధ్వజమెత్తారు షా. పుదుచ్చేరిలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్​.. ప్రభుత్వ పథకాలపై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. తన పాలనా కాలంలో అభివృద్ధి పనుల కన్నా.. గాంధీ కుటుంబానికి సేవ చేయడం, అవినీతి సొమ్మును తరలించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని ఆరోపించారు. ఎంతో మంది సీనియర్​ నాయకులు కాంగ్రెస్​ను వీడుతున్నారని.. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా పతనం దిశగా సాగుతోందన్నారు.

దేశంలో అంకితభావంతో కూడిన మత్స్య శాఖ లేదన్న రాహుల్​ వ్యాఖ్యలపైనా తీవ్రంగా మండిపడ్డారు షా. రెండేళ్ల క్రితమే మోదీ హయాంలో ఇది ఏర్పాటైందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.