ETV Bharat / bharat

కాంగ్రెస్ ఎంపీపై సింఘు సరిహద్దు వద్ద దాడి

author img

By

Published : Jan 25, 2021, 6:56 AM IST

సింఘు సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీ రవ్​నీత్ సింగ్ బిట్టుపై దాడి జరిగింది. కొందరు దుండగులు ఆయన టర్బైన్​ను లాగేసి దాడి చేశారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

cong mp luthiana assault
కాంగ్రెస్ ఎంపీపై సింఘు సరిహద్దు వద్ద దాడి

లూథియానా కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్‌ బిట్టుపై కొందరు ఆగంతుకులు సింఘు సరిహద్దు వద్ద దాడికి తెగపడ్డారు. ఆయన టర్బైన్‌ను లాగేశారు. బిట్టు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

సింఘు సరిహద్దు వద్ద రవ్​నీత్ సింగ్

గురుతేగ్​ బహదూర్‌ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సహచర ఎంపీ గుర్‌జీత్‌ సింగ్‌ ఔజ్లాతో కలిసి వచ్చారు బిట్టు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. కర్రలు, ఆయుధాలతో కొందరు ఒక్కసారిగా తమపై దాడికి తెగపడ్డారని ఎంపీ తెలిపారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని చెప్పారు. తమలో ఒకరిని చంపేందుకే ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దాడి తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయామని వివరించారు.

అయితే ఈ విషయంపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు మాత్రం ఇవ్వలేదు. జరిగిన ఘటన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా బిట్టు వెల్లడించారు.

లూథియానా కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్‌ బిట్టుపై కొందరు ఆగంతుకులు సింఘు సరిహద్దు వద్ద దాడికి తెగపడ్డారు. ఆయన టర్బైన్‌ను లాగేశారు. బిట్టు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

సింఘు సరిహద్దు వద్ద రవ్​నీత్ సింగ్

గురుతేగ్​ బహదూర్‌ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సహచర ఎంపీ గుర్‌జీత్‌ సింగ్‌ ఔజ్లాతో కలిసి వచ్చారు బిట్టు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. కర్రలు, ఆయుధాలతో కొందరు ఒక్కసారిగా తమపై దాడికి తెగపడ్డారని ఎంపీ తెలిపారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని చెప్పారు. తమలో ఒకరిని చంపేందుకే ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దాడి తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయామని వివరించారు.

అయితే ఈ విషయంపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు మాత్రం ఇవ్వలేదు. జరిగిన ఘటన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా బిట్టు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.