ETV Bharat / bharat

ట్విట్టర్​కు చిక్కులు- ఎండీపై కొత్త కేసు

author img

By

Published : Jul 4, 2021, 5:41 AM IST

Updated : Jul 4, 2021, 6:57 AM IST

ట్విట్టర్​ ఎండీ మనీష్​ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. మత విద్వేషాన్ని ట్విట్టర్​ వ్యాప్తి చేస్తోందని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

case on twitter india md
ట్విట్టర్ ఎండీ​పై కేసు

మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ట్విట్టర్​ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్​ మనీష్​ మహేశ్వరి, ఓ స్వచ్ఛంద సంస్థపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్యా సింగ్ అనే ఓ న్యాయవాది ఈమేరకు దిల్లీ సైబర్​ విభాగం డీసీపీకి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్​ మహేశ్వరి, పబ్లిక్​ పాలసీ మేనేజర్​ షాగుఫ్తా కమ్రాన్​, సహా 'రిపబ్లిక్​ ఎథీస్ట్​' వ్యవస్థాపకుడు ఆర్నిన్​ నవాబీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరారు.

రిపబ్లిక్​ ఎథీస్ట్​కు చెందిన ట్విట్టర్ ఖాతాలో కాళీ మాత ఫొటోలను తప్పుగా షేర్ చేశారని ఆదిత్యా సింగ్​ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా... శుత్రత్వాన్ని, అశాంతిని, సమాజంలో విద్వేషాన్ని రగిల్చేవిగా ఉన్నాయని తెలిపారు. దీన్ని తొలగించటంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున ట్విట్టర్​తో పాటు సదరు ఖాతాదారుపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని కోరారు.

ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్‌ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నిబంధనలను అమలు చేయనందుకుగాను భారత్‌లో ట్విట్టర్‌ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది.

ఇదీ చూడండి: Twitter: ఆ అధికారి నియామకంపై ట్విట్టర్ స్పష్టత

ఇదీ చూడండి: ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ట్విట్టర్​ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్​ మనీష్​ మహేశ్వరి, ఓ స్వచ్ఛంద సంస్థపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్యా సింగ్ అనే ఓ న్యాయవాది ఈమేరకు దిల్లీ సైబర్​ విభాగం డీసీపీకి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్​ మహేశ్వరి, పబ్లిక్​ పాలసీ మేనేజర్​ షాగుఫ్తా కమ్రాన్​, సహా 'రిపబ్లిక్​ ఎథీస్ట్​' వ్యవస్థాపకుడు ఆర్నిన్​ నవాబీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరారు.

రిపబ్లిక్​ ఎథీస్ట్​కు చెందిన ట్విట్టర్ ఖాతాలో కాళీ మాత ఫొటోలను తప్పుగా షేర్ చేశారని ఆదిత్యా సింగ్​ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా... శుత్రత్వాన్ని, అశాంతిని, సమాజంలో విద్వేషాన్ని రగిల్చేవిగా ఉన్నాయని తెలిపారు. దీన్ని తొలగించటంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున ట్విట్టర్​తో పాటు సదరు ఖాతాదారుపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని కోరారు.

ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్‌ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నిబంధనలను అమలు చేయనందుకుగాను భారత్‌లో ట్విట్టర్‌ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది.

ఇదీ చూడండి: Twitter: ఆ అధికారి నియామకంపై ట్విట్టర్ స్పష్టత

ఇదీ చూడండి: ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

Last Updated : Jul 4, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.