కేరళలోని కొట్టాయంలో ఉన్న సీఎంఎస్ కళాశాలలో ఓ అధునాతన థియేటర్ను ఏర్పాటు చేశారు. పాత ఆడిటోరియాన్ని ఆధునీకరించి రూ.30 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. విద్యా ప్రమాణాలను పెంచి, ఉన్నత స్థాయిలో బోధించేందుకు దీనిని రూపొందించారు.
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 86 ప్రత్యేక కుర్చీలు, అత్యాధునిక శబ్ద, దృశ్య వ్యవస్థలను ఈ థియేటర్లో అమర్చారు. కళాశాలలోని పాత భవనంలోనే దీనిని ఏర్పాటు చేయడం ద్వారా దాని పాశ్చాత్య నిర్మాణ సౌందర్యాన్ని యధాతథంగా కొనసాగించారు.
ఈ థియేటర్లో ఫిల్మ్ ఫెస్టివల్లు కూడా జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ వర్గీస్ జోషువా తెలిపారు. అందులో బోధన ద్వారా విద్యార్థులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. సీఎంఎస్ కళాశాలపై ఓ డాక్యుమెంటరీతో వచ్చేవారం ఈ థియేటర్ను ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి: అక్కడ కల్తీ చేస్తే జీవితఖైదే!