ETV Bharat / bharat

'వన్యప్రాణుల అక్రమరవాణాపై దృష్టి సారించండి'

author img

By

Published : Dec 20, 2020, 12:05 AM IST

Updated : Dec 20, 2020, 6:17 AM IST

అడవి జంతువుల అక్రమరవాణాపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలన్నారు సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. ఈ అక్రమాలకు పాల్పడే వారే ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగం అవుతున్నారని పేర్కొన్నారు.

CJI for stern action against people indulging in illegal wildlife trade
'వన్యప్రాణల అక్రమరవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి'

వన్యప్రాణులను అక్రమంగా తరలించే వాళ్లే మాదకద్రవ్యాలు, తుపాకీ వ్యాపారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. ఇటువంటి వారిని అడ్డుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఈడీలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అసోంలో జ్యుడిషియల్​ అకాడమీ, 'ప్రపంచ వన్యప్రాణ సంరక్షణ సంస్థ' సంయుక్తంగా చేపట్టిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అటవీ జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి కఠిన చట్టాలు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు జస్టిస్ బోబ్డే. చట్ట విరుద్ధంగా చేసే ఈ వ్యాపారాల్లో సంపాదించిన సొమ్ము ఇతర వ్యాపారాల్లోకి వెళుతోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. వీటిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలన్నారు.

వన్యప్రాణులను అక్రమంగా తరలించే వాళ్లే మాదకద్రవ్యాలు, తుపాకీ వ్యాపారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. ఇటువంటి వారిని అడ్డుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఈడీలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అసోంలో జ్యుడిషియల్​ అకాడమీ, 'ప్రపంచ వన్యప్రాణ సంరక్షణ సంస్థ' సంయుక్తంగా చేపట్టిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అటవీ జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి కఠిన చట్టాలు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు జస్టిస్ బోబ్డే. చట్ట విరుద్ధంగా చేసే ఈ వ్యాపారాల్లో సంపాదించిన సొమ్ము ఇతర వ్యాపారాల్లోకి వెళుతోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. వీటిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలన్నారు.

ఇదీ చూడండి: ఐదు దశాబ్దాల తర్వాత పాల్గొంటున్న ప్రధాని

Last Updated : Dec 20, 2020, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.