ETV Bharat / bharat

కమల్​ వివాదస్పద ట్వీట్​- చిన్మయి ధ్వజం

author img

By

Published : Jan 4, 2021, 5:27 PM IST

Updated : Jan 4, 2021, 8:15 PM IST

ఎంఎన్​ఎం పార్టీ అధినేత కమల్​ హాసన్​పై విమర్శలు గుప్పించింది గాయని చిన్మయి శ్రీపాద. ఇటీవల కమల్​ చేసిన ఓ ట్వీట్​.. మహిళలను అగౌరవపరిచేలా ఉందని మండిపడింది. మహిళలు తమ గౌరవాన్ని పెప్పర్​ స్ప్రేతో కాకుండా.. ఆత్మవిశ్వాసంతో రక్షించుకోగలరా? అని ధ్వజమెత్తింది.

Chinmayi sees Kamal's tweet as anti-women
కమల్​ వివాదస్పద ట్వీట్​- చిన్మయి ధ్వజం

మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​ చేసిన ఓ ట్వీట్​ వివాదస్పదంగా మారింది. ఆ ట్వీట్​ మహిళలను అవమానించేలా ఉందని విమర్శనాస్త్రాలు సంధించింది గాయని చిన్మయి శ్రీపాద. మహిళలపై జరుగుతున్న దాడులను ఆత్మగౌరవంతో కాపాడుకోవాలా? అని కమల్ చేసిన ట్వీట్​పై ధ్వజమెత్తింది.

ఏం జరిగింది..

ఫుడ్​ బ్యాంక్​ ఇండియా వ్యవస్థాపకురాలు, ఎంఎన్​ఎం మహిళా విభాగం సభ్యురాలు స్నేహా మోహన్​దాస్ తన​ ఇంట్లో మార్షల్​ ఆర్ట్స్​ సాధన చేస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. "దానికి మిమ్మల్ని మీరు రక్షించుకునే సామర్థ్యంపై విశ్వాసం ఉంటే నిర్భయంగా, మరింత స్వేచ్ఛగా జీవించవచ్చు." అంటూ ట్యాగ్​లైన్ జోడించారు​.

కమల్​ ట్వీట్​లో ఏముంది?

మోహన్​దాస్​ ట్వీట్​పై స్పందించిన కమల్​.. "మహిళల రక్షణ, సాధికారతకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. దాంతో పాటు ఆత్మరక్షణ సామర్థ్యం ఆత్మవిశ్వాసం ఉంటే.. హింసాత్మక ఘటనలు అహింసగా మారుతాయి. హింస, అహింసల సమ్మేళనం ఎలాంటి దుర్ఘటనలు జరగడానికి తావివ్వదు. మీ ఆత్మవిశ్వాసం.. పెప్పర్​ స్ప్రే కంటే మెరుగ్గా పని చేస్తుంది." అని కమల్ ట్వీట్​​ చేశారు.

'దాడి జరుగుతుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలా?'

కమల్​ ట్వీట్​పై స్పందిస్తూ.. ''మహిళలు ఆత్మరక్షణ సాధన చేయడం, నేర్చుకోవడాన్ని ఆయన​ అవమానిస్తున్నారు. అందుకు బదులు మహిళలు ఆత్మవిశ్వాసంతో తమను తాము కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. కిరాతకులు దాడులకు పాల్పడుతుంటే మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మహిళలకు ఇలాంటి సలహాలనే కమల్​ ఇస్తున్నార'ని ఆరోపించింది చిన్మయి.

2014లోనూ కమల్​.. ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మనసు పరిశుభ్రంగా ఉంటే మీ వద్దుకు ఎవరూ రారు' అని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పట్లో దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.

ఇదీ చూడండి: మూడేళ్ల పాప లాకప్​ డెత్​పై నిరసన జ్వాల

మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​ చేసిన ఓ ట్వీట్​ వివాదస్పదంగా మారింది. ఆ ట్వీట్​ మహిళలను అవమానించేలా ఉందని విమర్శనాస్త్రాలు సంధించింది గాయని చిన్మయి శ్రీపాద. మహిళలపై జరుగుతున్న దాడులను ఆత్మగౌరవంతో కాపాడుకోవాలా? అని కమల్ చేసిన ట్వీట్​పై ధ్వజమెత్తింది.

ఏం జరిగింది..

ఫుడ్​ బ్యాంక్​ ఇండియా వ్యవస్థాపకురాలు, ఎంఎన్​ఎం మహిళా విభాగం సభ్యురాలు స్నేహా మోహన్​దాస్ తన​ ఇంట్లో మార్షల్​ ఆర్ట్స్​ సాధన చేస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. "దానికి మిమ్మల్ని మీరు రక్షించుకునే సామర్థ్యంపై విశ్వాసం ఉంటే నిర్భయంగా, మరింత స్వేచ్ఛగా జీవించవచ్చు." అంటూ ట్యాగ్​లైన్ జోడించారు​.

కమల్​ ట్వీట్​లో ఏముంది?

మోహన్​దాస్​ ట్వీట్​పై స్పందించిన కమల్​.. "మహిళల రక్షణ, సాధికారతకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. దాంతో పాటు ఆత్మరక్షణ సామర్థ్యం ఆత్మవిశ్వాసం ఉంటే.. హింసాత్మక ఘటనలు అహింసగా మారుతాయి. హింస, అహింసల సమ్మేళనం ఎలాంటి దుర్ఘటనలు జరగడానికి తావివ్వదు. మీ ఆత్మవిశ్వాసం.. పెప్పర్​ స్ప్రే కంటే మెరుగ్గా పని చేస్తుంది." అని కమల్ ట్వీట్​​ చేశారు.

'దాడి జరుగుతుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలా?'

కమల్​ ట్వీట్​పై స్పందిస్తూ.. ''మహిళలు ఆత్మరక్షణ సాధన చేయడం, నేర్చుకోవడాన్ని ఆయన​ అవమానిస్తున్నారు. అందుకు బదులు మహిళలు ఆత్మవిశ్వాసంతో తమను తాము కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. కిరాతకులు దాడులకు పాల్పడుతుంటే మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మహిళలకు ఇలాంటి సలహాలనే కమల్​ ఇస్తున్నార'ని ఆరోపించింది చిన్మయి.

2014లోనూ కమల్​.. ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మనసు పరిశుభ్రంగా ఉంటే మీ వద్దుకు ఎవరూ రారు' అని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పట్లో దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.

ఇదీ చూడండి: మూడేళ్ల పాప లాకప్​ డెత్​పై నిరసన జ్వాల

Last Updated : Jan 4, 2021, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.