ETV Bharat / bharat

'మూడో దశ టీకా పంపిణీలో వివక్ష'

కేంద్రం ప్రకటించిన మూడో దశ టీకా పంపిణీ ప్రక్రియ ప్రజలకు వ్యతిరేకంగా.. మార్కెట్లకు అనుకూలంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 22, 2021, 9:38 PM IST

Mamata Banerjee
మమతా బెనర్జీ

మూడో దశ కరోనా వాక్సిన్ పంపిణీ ప్రక్రియ వివక్షతతో కూడుకుని ఉందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అది పూర్తిగా మార్కెట్లకు, అనుకూలంగా.. ప్రజల శ్రేయస్సుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మమత రెండో లేఖ రాశారు.

మే1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవడానికి కేంద్రం అనుమంతించింది. కాగా కేంద్రానికి రూ. 150కి, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ.400కు అమ్ముతున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.

అయితే ఇది వివక్షపూరితంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో టీకాలతో వ్యాపారం చేయడం తగదని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు చెప్పారు.

ఇదీ చదవండి: 'అక్రమ వలసదారులే మమత ఓటు బ్యాంకు'

మూడో దశ కరోనా వాక్సిన్ పంపిణీ ప్రక్రియ వివక్షతతో కూడుకుని ఉందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అది పూర్తిగా మార్కెట్లకు, అనుకూలంగా.. ప్రజల శ్రేయస్సుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మమత రెండో లేఖ రాశారు.

మే1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవడానికి కేంద్రం అనుమంతించింది. కాగా కేంద్రానికి రూ. 150కి, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ.400కు అమ్ముతున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.

అయితే ఇది వివక్షపూరితంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో టీకాలతో వ్యాపారం చేయడం తగదని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు చెప్పారు.

ఇదీ చదవండి: 'అక్రమ వలసదారులే మమత ఓటు బ్యాంకు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.