ETV Bharat / bharat

రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ భయాలు

author img

By

Published : Nov 19, 2020, 7:27 PM IST

దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మరింతగా విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర బృందాలు.. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు/నగరాలు మళ్లీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది.

Centre rushes high-level Central teams to Haryana, Rajasthan, Gujarat, Manipur to monitor Covid-19  situation
రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ భయాలు

భారత్​లో కొవిడ్ నివారణకు కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కాస్త శాంతించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు/నగరాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.

కర్ఫ్యూ భయాలు..

కరోనా భయాల నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూ బాటలో పయనిస్తున్నాయి. కొవిడ్​ హాట్​స్పాట్​లుగా ఉన్న నగరాల్లో రోజువారీ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

  • గుజరాత్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్​లో నవంబర్​ 20 నుంచి ఉదయం 9-6 గంటల మధ్య రోజువారీ కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి మెరుగయ్యేంత వరకు ఇది కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
  • దిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేశారు. మాస్కు లేకుంటే విధించే జరిమానాను రూ. 2 వేలకు పెంచింది కేజ్రీవాల్​ సర్కార్​.

ఇదీ చూడండి: 'ఇకపై మాస్క్​ లేకుంటే రూ. 2వేలు కట్టాల్సిందే'

  • దేశవ్యాప్తంగా బుధవారం నమోదైన కరోనా మరణాల్లో 22.39 శాతం దిల్లీ నుంచే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే దేశ రాజధానిలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

కరోనా తీవ్రత దృష్ట్యా.. హరియాణా, రాజస్థాన్​, గుజరాత్​, మణిపుర్​ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు తరలివెళ్లాయి. కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్న జిల్లాల్లో సందర్శించి.. నివారణ చర్యలపై దృష్టి సారిస్తాయి.

రోగ నిర్ధరణ, కట్టడి చర్యలు, పరీక్షల పెంపు సంబంధిత అంశాల్లో రాష్ట్ర యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తాయి.

'' దిల్లీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న తరుణంలో.. ఇదే ప్రభావం దేశ రాజధాని పరిసర ప్రాంతాలు, హరియాణా, రాజస్థాన్​లపైనా పడింది. ఇక్కడ కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందాలను నియమించాం.''

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

  • దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు డా. రణదీప్​ గులేరియా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం హరియాణా వెళ్లింది.
  • నీతి ఆయోగ్​ సభ్యుడు డా. వీకే పాల్​ రాజస్థాన్​ వెళ్లే బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
  • గుజరాత్​ టీంను ఎన్​సీడీసీ డైరెక్టర్​ డా. ఎస్​కే సింగ్​ లీడ్​ చేస్తున్నారు.
  • అడిషనల్​ డీడీజీ డా. స్వాతిచరణ్​ బృందం మణిపుర్​లో కరోనా పరిస్థితిపై సమీక్షిస్తోంది.

4.95 శాతంగా యాక్టివ్​ కేసులు..

బుధవారం దేశవ్యాప్తంగా 48 వేలమందికిపైగా కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 5 శాతం దిగువకు పడిపోయింది. రికవరీ రేటు 93.58 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు

భారత్​లో కొవిడ్ నివారణకు కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కాస్త శాంతించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు/నగరాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.

కర్ఫ్యూ భయాలు..

కరోనా భయాల నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూ బాటలో పయనిస్తున్నాయి. కొవిడ్​ హాట్​స్పాట్​లుగా ఉన్న నగరాల్లో రోజువారీ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

  • గుజరాత్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్​లో నవంబర్​ 20 నుంచి ఉదయం 9-6 గంటల మధ్య రోజువారీ కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి మెరుగయ్యేంత వరకు ఇది కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
  • దిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేశారు. మాస్కు లేకుంటే విధించే జరిమానాను రూ. 2 వేలకు పెంచింది కేజ్రీవాల్​ సర్కార్​.

ఇదీ చూడండి: 'ఇకపై మాస్క్​ లేకుంటే రూ. 2వేలు కట్టాల్సిందే'

  • దేశవ్యాప్తంగా బుధవారం నమోదైన కరోనా మరణాల్లో 22.39 శాతం దిల్లీ నుంచే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే దేశ రాజధానిలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

కరోనా తీవ్రత దృష్ట్యా.. హరియాణా, రాజస్థాన్​, గుజరాత్​, మణిపుర్​ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు తరలివెళ్లాయి. కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్న జిల్లాల్లో సందర్శించి.. నివారణ చర్యలపై దృష్టి సారిస్తాయి.

రోగ నిర్ధరణ, కట్టడి చర్యలు, పరీక్షల పెంపు సంబంధిత అంశాల్లో రాష్ట్ర యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తాయి.

'' దిల్లీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న తరుణంలో.. ఇదే ప్రభావం దేశ రాజధాని పరిసర ప్రాంతాలు, హరియాణా, రాజస్థాన్​లపైనా పడింది. ఇక్కడ కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందాలను నియమించాం.''

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

  • దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు డా. రణదీప్​ గులేరియా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం హరియాణా వెళ్లింది.
  • నీతి ఆయోగ్​ సభ్యుడు డా. వీకే పాల్​ రాజస్థాన్​ వెళ్లే బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
  • గుజరాత్​ టీంను ఎన్​సీడీసీ డైరెక్టర్​ డా. ఎస్​కే సింగ్​ లీడ్​ చేస్తున్నారు.
  • అడిషనల్​ డీడీజీ డా. స్వాతిచరణ్​ బృందం మణిపుర్​లో కరోనా పరిస్థితిపై సమీక్షిస్తోంది.

4.95 శాతంగా యాక్టివ్​ కేసులు..

బుధవారం దేశవ్యాప్తంగా 48 వేలమందికిపైగా కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 5 శాతం దిగువకు పడిపోయింది. రికవరీ రేటు 93.58 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.