ETV Bharat / bharat

'దీదీ'పై ప్రజాగ్రహం స్పష్టంగా తెలుస్తోంది: షా

author img

By

Published : Nov 5, 2020, 2:20 PM IST

బంగాల్​ ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అగ్రహంగా ఉన్నారని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోల్​కతా పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Amit shah-WB
'దీదీ'పై ప్రజల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది: షా

ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బంగాల్​ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. గురువారం రాష్ట్రంలో పర్యటించిన షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమలుచేస్తోన్న పథకాల ద్వారా రాష్ట్ర పేద ప్రజలు లబ్ధి పొందకుండా అడ్డుకుంటున్నారని బంగాల్​ ముఖ్యమంత్రిని తప్పుపట్టారు.

" బుధవారం రాత్రి నుంచి బంగాల్​లోనే ఉన్నాను. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని నా నమ్మకం. దీదీ పాలన అంతం అయ్యే సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బంగాలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది".

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

ఇదీ చదవండి:భాజపా కార్యకర్త కుటుంబానికి షా పరామర్శ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బంగాల్​ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. గురువారం రాష్ట్రంలో పర్యటించిన షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమలుచేస్తోన్న పథకాల ద్వారా రాష్ట్ర పేద ప్రజలు లబ్ధి పొందకుండా అడ్డుకుంటున్నారని బంగాల్​ ముఖ్యమంత్రిని తప్పుపట్టారు.

" బుధవారం రాత్రి నుంచి బంగాల్​లోనే ఉన్నాను. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని నా నమ్మకం. దీదీ పాలన అంతం అయ్యే సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బంగాలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది".

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

ఇదీ చదవండి:భాజపా కార్యకర్త కుటుంబానికి షా పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.