ETV Bharat / bharat

పార్టీ రాజ్యసభ ఎంపీలకు భాజపా విప్​ జారీ

author img

By

Published : Feb 5, 2021, 10:57 AM IST

ఫిబ్రవరి 8-12 మధ్య తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని భాజపా రాజ్యసభ సభ్యులకు విప్​ జారీ చేసింది ఆ పార్టీ. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని వారికి స్పష్టం చేసింది.

రాజ్యసభలోని భాజపా సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు తప్పనిసరిగా సభలో ఉండాలని, ఆ సమయంలో సభలో చాలా ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటాయని అందులో స్పష్టం చేసింది.

ఈ 5 రోజుల వ్యవధిలో ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని సూచించింది. ఎగువ సభలో కీలక బిల్లులను కూడా ఆమోదించుకోనున్నట్లు భాజపా తెలిపింది.

ఫిబ్రవరి 13నే..

ఈ ఫిబ్రవరి 13నే బడ్జెట్​ తొలి విడత సమావేశాలకు ఆఖరు రోజు. ఈ నేపథ్యంలోనే ఎంపీలకు విప్​ జారీ చేసింది భాజపా.

కొవిడ్​ నేపథ్యంలో రోజూ 5 గంటల పాటే సమావేశాలు సాగుతున్నాయి. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు రాజ్యసభ, 4 నుంచి 9 గంటల మధ్య లోక్​సభ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

రాజ్యసభలోని భాజపా సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు తప్పనిసరిగా సభలో ఉండాలని, ఆ సమయంలో సభలో చాలా ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటాయని అందులో స్పష్టం చేసింది.

ఈ 5 రోజుల వ్యవధిలో ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని సూచించింది. ఎగువ సభలో కీలక బిల్లులను కూడా ఆమోదించుకోనున్నట్లు భాజపా తెలిపింది.

ఫిబ్రవరి 13నే..

ఈ ఫిబ్రవరి 13నే బడ్జెట్​ తొలి విడత సమావేశాలకు ఆఖరు రోజు. ఈ నేపథ్యంలోనే ఎంపీలకు విప్​ జారీ చేసింది భాజపా.

కొవిడ్​ నేపథ్యంలో రోజూ 5 గంటల పాటే సమావేశాలు సాగుతున్నాయి. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు రాజ్యసభ, 4 నుంచి 9 గంటల మధ్య లోక్​సభ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.