ETV Bharat / bharat

up polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలపై భాజపా కీలక సమావేశం

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల (up polls 2022) ప్రచారాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి పార్టీ నాయకులతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై పాటించాల్సిన కార్యచరణపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.

author img

By

Published : Nov 18, 2021, 10:36 PM IST

UP assembly polls
యూపీ ఎన్నికలు

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలపై (up polls 2022) చర్చించేందుకు పార్టీ నాయకులతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా 'విజయ్​ సంకల్ప్ రథ్​ యాత్ర' (BJP meetings today) పేరిట ప్రచారాన్ని ప్రారంభించనుందని సమాచారం. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, జేపీ నడ్డాల పర్యటనలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రస్థాయి నాయకులతో ఇప్పటికే భాజపా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. రైతుల ఉద్యమాలు ఎక్కువగా ఉన్న రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఉత్తర్​ప్రదేశ్​లో పార్టీ ఎన్నికల ఇంఛార్జ్​గా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్​ కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బిహార్​లో​ 'సర్పంచ్'​గా అనుష్క రికార్డు

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలపై (up polls 2022) చర్చించేందుకు పార్టీ నాయకులతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా 'విజయ్​ సంకల్ప్ రథ్​ యాత్ర' (BJP meetings today) పేరిట ప్రచారాన్ని ప్రారంభించనుందని సమాచారం. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, జేపీ నడ్డాల పర్యటనలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రస్థాయి నాయకులతో ఇప్పటికే భాజపా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. రైతుల ఉద్యమాలు ఎక్కువగా ఉన్న రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఉత్తర్​ప్రదేశ్​లో పార్టీ ఎన్నికల ఇంఛార్జ్​గా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్​ కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బిహార్​లో​ 'సర్పంచ్'​గా అనుష్క రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.