ETV Bharat / bharat

నడ్డా X రాహుల్​: తారస్థాయికి మాటల యుద్ధం

చైనా, సాగు చట్టాలు, కొవిడ్​-19 వంటి అంశాలను చూపుతూ కేంద్రంపై విమర్శలు చేస్తోన్న రాహుల్​ గాంధీపై ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆ వెనువెంటనే నడ్డా ఆరోపణలను తిప్పుకొడుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్​. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

author img

By

Published : Jan 19, 2021, 5:29 PM IST

JP Nadda hits Rahul gandhi
రాహుల్​ గాంధీపై నడ్డా విమర్శలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. రాహుల్​ విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్​ వేదికగా ఘాటుగా స్పందించారు నడ్డా. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.

  • When will @RahulGandhi, his dynasty and Congress stop lying on China?
    Can he deny that thousands of kms, including the one in Arunachal Pradesh he is referring to was gifted by none other than Pandit Nehru to the Chinese?
    Time and again, why does Congress surrender to China?

    — Jagat Prakash Nadda (@JPNadda) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చైనా విషయంలో దుష్ప్రచారం చేయటం కాంగ్రెస్​ ఎప్పుడు మానుకుంటుందో చెప్పాలి. నాటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూనే అరుణాచల్​ ప్రదేశ్​లోని వేల కిలోమీటర్ల ప్రాంతాలను చైనాకు కానుకగా ఇచ్చారన్న నిజాన్ని కాంగ్రెస్ ఒప్పుకోగలదా? కాంగ్రెస్​ ఇంకా ఎన్ని సార్లు డ్రాగన్ దేశం ముందు లొంగిపోతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదు? కనీస మద్దతు ధరను మీరు ఎందుకు పెంచలేదు? '

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

రాహుల్​.. విద్వేషభరిత ప్రసంగాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నడ్డా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారికి రైతులు గుర్తొస్తారని చురకలు అంటించారు. 'చైనాతో కాంగ్రెస్​ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాహుల్​ భావిస్తున్నారా? గాంధీ కుటుంబం నడుపుతున్న ట్రస్ట్​లకు చైనా కానుకగా ఇచ్చిన ఆస్తులను తిరిగివ్వాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.

రాహుల్​ ఎదురుదాడి..

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలను తిప్పికొట్టారు రాహుల్​. జాతీయ భద్రత, సాగు చట్టాలు, చైనా వంటి కీలక అంశాలపై ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలోని భట్టా పార్సాల్​లో భూసేకరణ వివాదంలో రైతులకు మద్దతుగా నిలిచింది రాహుల్​ గాంధీయేనని, భాజపా నేత నడ్డా కాదని రైతులకు తెలుసునన్నారు.

" నేను ఎవరికీ భయపడటం లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. నేను సచ్ఛీలుడను. వారు నన్ను తాకలేరు. నేను నిజమైన దేశభక్తుడిని. నా దేశాన్ని కాపాడుకుంటా. అందుకోసం పోరాటం కొనసాగిస్తా. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

అంతకు ముందు.. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు రాహుల్​. రైతుల సమస్యకు ఏకైక పరిష్కారం సాగు చట్టాలను రద్దు చేయటమేనన్నారు. సాగు చట్టాలతో కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ రూపొందించిన బుక్​లెట్​ను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాహుల్​. నిజాన్ని దాచిపెట్టి, కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ చట్టాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని ముగ్గురి నుంచి నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకెళతాయని విమర్శించారు. తాను వంద శాతం రైతులకు మద్దతిస్తున్నానని, దేశంలోని ప్రతిఒక్కరు మద్దతివ్వాలని సూచించారు.

ఇదీ చూడండి: బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. రాహుల్​ విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్​ వేదికగా ఘాటుగా స్పందించారు నడ్డా. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.

  • When will @RahulGandhi, his dynasty and Congress stop lying on China?
    Can he deny that thousands of kms, including the one in Arunachal Pradesh he is referring to was gifted by none other than Pandit Nehru to the Chinese?
    Time and again, why does Congress surrender to China?

    — Jagat Prakash Nadda (@JPNadda) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చైనా విషయంలో దుష్ప్రచారం చేయటం కాంగ్రెస్​ ఎప్పుడు మానుకుంటుందో చెప్పాలి. నాటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూనే అరుణాచల్​ ప్రదేశ్​లోని వేల కిలోమీటర్ల ప్రాంతాలను చైనాకు కానుకగా ఇచ్చారన్న నిజాన్ని కాంగ్రెస్ ఒప్పుకోగలదా? కాంగ్రెస్​ ఇంకా ఎన్ని సార్లు డ్రాగన్ దేశం ముందు లొంగిపోతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదు? కనీస మద్దతు ధరను మీరు ఎందుకు పెంచలేదు? '

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

రాహుల్​.. విద్వేషభరిత ప్రసంగాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నడ్డా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారికి రైతులు గుర్తొస్తారని చురకలు అంటించారు. 'చైనాతో కాంగ్రెస్​ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాహుల్​ భావిస్తున్నారా? గాంధీ కుటుంబం నడుపుతున్న ట్రస్ట్​లకు చైనా కానుకగా ఇచ్చిన ఆస్తులను తిరిగివ్వాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.

రాహుల్​ ఎదురుదాడి..

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలను తిప్పికొట్టారు రాహుల్​. జాతీయ భద్రత, సాగు చట్టాలు, చైనా వంటి కీలక అంశాలపై ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలోని భట్టా పార్సాల్​లో భూసేకరణ వివాదంలో రైతులకు మద్దతుగా నిలిచింది రాహుల్​ గాంధీయేనని, భాజపా నేత నడ్డా కాదని రైతులకు తెలుసునన్నారు.

" నేను ఎవరికీ భయపడటం లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. నేను సచ్ఛీలుడను. వారు నన్ను తాకలేరు. నేను నిజమైన దేశభక్తుడిని. నా దేశాన్ని కాపాడుకుంటా. అందుకోసం పోరాటం కొనసాగిస్తా. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

అంతకు ముందు.. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు రాహుల్​. రైతుల సమస్యకు ఏకైక పరిష్కారం సాగు చట్టాలను రద్దు చేయటమేనన్నారు. సాగు చట్టాలతో కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ రూపొందించిన బుక్​లెట్​ను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాహుల్​. నిజాన్ని దాచిపెట్టి, కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ చట్టాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని ముగ్గురి నుంచి నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకెళతాయని విమర్శించారు. తాను వంద శాతం రైతులకు మద్దతిస్తున్నానని, దేశంలోని ప్రతిఒక్కరు మద్దతివ్వాలని సూచించారు.

ఇదీ చూడండి: బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.