ETV Bharat / bharat

ఉన్నావ్​ బాధితురాలి ఆరోపణలు- అభ్యర్థిని మార్చిన భాజపా

author img

By

Published : Jun 24, 2021, 8:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో జులై 3న జరగనున్న జిల్లా పంచాయత్​ ఛైర్మన్​ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని భాజపా మార్చివేసింది. ఉన్నావ్​ కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​కు ఆ అభ్యర్థి సన్నిహితుడని​ బాధితురాలు ఆరోపణలు చేయడం వల్ల పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

up district elections
ఉన్నావ్​ బాధితురాలు

ఉన్నావ్​ బాధితురాలు ఆరోపణలతో .. ఉత్తర్​ప్రదేశ్​లో జులై 3న జరగనున్న జిల్లా పంచాయత్​ ఛైర్మన్​ పదవికి ప్రకటించిన తమ అభ్యర్థి అరుణ్​ సింగ్​ను భాజపా మార్చివేసింది. ఆ అభ్యర్థి, ఉన్నావ్​ కేసులో శిక్షఅనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​కు సన్నిహితుడని​ బాధితురాలు ఆరోపించింది. అంతే కాకుండా అతనితో తనకు ముప్పు ఉందని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, యూపీ సీఎంకు లేఖలు పంపించింది. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

"నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని భాజపా చెబుతూనే.. నా తండ్రిని చంపిన వారికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కుల్​దీప్​ సింగ్​కు ప్రభుత్వం ఇప్పటికీ మద్దతుగానే నిలుస్తోంది. అరుణ్​ సింగ్​కు పార్టీ టికెట్​ ఇస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అరుణ్​ సింగ్ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా."

-ఉన్నావ్​ బాధితురాలి లేఖ

అరుణ్​ సింగ్​​పై ఉన్నావ్ బాధితురాలు ఆరోపణలు నిరాధారమైనవని, ప్రతిపక్షాల కుట్రగా భాజపా జిల్లా అధ్యక్షుడు రాజ్​ కిశోర్ రావత్ ఇటీవల ఆరోపించారు. కానీ పార్టీ నిర్ణయం మేరకు అరుణ్​ సింగ్​ నామినేషన్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: గుప్కార్​ కూటమి నేతలతో ముగిసిన మోదీ భేటీ

ఉన్నావ్​ బాధితురాలు ఆరోపణలతో .. ఉత్తర్​ప్రదేశ్​లో జులై 3న జరగనున్న జిల్లా పంచాయత్​ ఛైర్మన్​ పదవికి ప్రకటించిన తమ అభ్యర్థి అరుణ్​ సింగ్​ను భాజపా మార్చివేసింది. ఆ అభ్యర్థి, ఉన్నావ్​ కేసులో శిక్షఅనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​కు సన్నిహితుడని​ బాధితురాలు ఆరోపించింది. అంతే కాకుండా అతనితో తనకు ముప్పు ఉందని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, యూపీ సీఎంకు లేఖలు పంపించింది. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

"నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని భాజపా చెబుతూనే.. నా తండ్రిని చంపిన వారికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కుల్​దీప్​ సింగ్​కు ప్రభుత్వం ఇప్పటికీ మద్దతుగానే నిలుస్తోంది. అరుణ్​ సింగ్​కు పార్టీ టికెట్​ ఇస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అరుణ్​ సింగ్ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా."

-ఉన్నావ్​ బాధితురాలి లేఖ

అరుణ్​ సింగ్​​పై ఉన్నావ్ బాధితురాలు ఆరోపణలు నిరాధారమైనవని, ప్రతిపక్షాల కుట్రగా భాజపా జిల్లా అధ్యక్షుడు రాజ్​ కిశోర్ రావత్ ఇటీవల ఆరోపించారు. కానీ పార్టీ నిర్ణయం మేరకు అరుణ్​ సింగ్​ నామినేషన్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: గుప్కార్​ కూటమి నేతలతో ముగిసిన మోదీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.