ETV Bharat / bharat

'రెండు గంటల్లోనే ఓటమిని ఒప్పుకొన్న జేడీయూ!'

author img

By

Published : Nov 10, 2020, 10:47 AM IST

Updated : Nov 10, 2020, 10:53 AM IST

సాధారణంగా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాక పార్టీలు గెలుపోటములపై స్పందిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా బిహార్​ అసెంబ్లీ కౌంటింగ్ మొదలైన రెండు గంటల్లోనే జేడీయూ నేత ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నారంటే..?

Bihar polls
రెండు గంటల్లోనే ఓటమిని ఒప్పుకొన్న జేడీయూ!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీఏ, మహాకూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. అయితే విచిత్రంగా కౌంటింగ్​ ప్రారంభమైన రెండు గంటల్లోనే జేడీయూ సీనియర్​ నేత ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కౌంటింగ్​ మొదలైన కాసేపటికి మహాకూటమి ఎక్కువ స్థానాల్లో లీడ్​ ఉంది. ఈ ట్రెండ్​ చూసి జేడీయూ నేత కేసీ త్యాగి ఇలా వ్యాఖ్యానించారు.

"ఏడాది క్రితం ఆర్​జేడీ ఒక్క లోక్​సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. లోక్​సభ ఫలితాల ప్రకారం, జేడీయూ దాని మిత్రపక్షాలు 200కు పైగా స్థానాల్లో గెలుపొందాలి. ఎందుకంటే ఏడాదిగా ఆర్​జేడీలో ఎలాంటి మార్పు రాలేదు. నితీశ్​ బ్రాండ్​ పోలేదు. కానీ మేం ఓడిపోవడానికి ఒకే ఒక కారణం కొవిడ్​-19."

- కేసీ త్యాగి, జేడీయూ సీనియర్ నేత

లోక్​జనశక్తి పార్టీ నేత చిరాగ్​ పాసవాన్​ తీరుపై త్యాగి విమర్శలు గుప్పించారు. ఎల్​జేపీ ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా వ్యవహరించిందని, బిహార్​ రాజకీయాల్లో అసలు ఆ పార్టీకి స్థానం లేదన్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీఏ, మహాకూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. అయితే విచిత్రంగా కౌంటింగ్​ ప్రారంభమైన రెండు గంటల్లోనే జేడీయూ సీనియర్​ నేత ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కౌంటింగ్​ మొదలైన కాసేపటికి మహాకూటమి ఎక్కువ స్థానాల్లో లీడ్​ ఉంది. ఈ ట్రెండ్​ చూసి జేడీయూ నేత కేసీ త్యాగి ఇలా వ్యాఖ్యానించారు.

"ఏడాది క్రితం ఆర్​జేడీ ఒక్క లోక్​సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. లోక్​సభ ఫలితాల ప్రకారం, జేడీయూ దాని మిత్రపక్షాలు 200కు పైగా స్థానాల్లో గెలుపొందాలి. ఎందుకంటే ఏడాదిగా ఆర్​జేడీలో ఎలాంటి మార్పు రాలేదు. నితీశ్​ బ్రాండ్​ పోలేదు. కానీ మేం ఓడిపోవడానికి ఒకే ఒక కారణం కొవిడ్​-19."

- కేసీ త్యాగి, జేడీయూ సీనియర్ నేత

లోక్​జనశక్తి పార్టీ నేత చిరాగ్​ పాసవాన్​ తీరుపై త్యాగి విమర్శలు గుప్పించారు. ఎల్​జేపీ ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా వ్యవహరించిందని, బిహార్​ రాజకీయాల్లో అసలు ఆ పార్టీకి స్థానం లేదన్నారు.

Last Updated : Nov 10, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.