ETV Bharat / bharat

కరోనాతో బిహార్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృతి - చీఫ్​ సెక్రటరీ అరుణ్​ కుమార్​

కరోనా మహమ్మారి కాటుకు బిహార్​ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్​కుమార్​ సింగ్​ బలయ్యారు. ఇటీవలే చీఫ్​ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు అరుణ్​​.

Arun kumar
బిహార్​ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్​కుమార్​ సింగ్
author img

By

Published : Apr 30, 2021, 3:09 PM IST

కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బిహార్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్​కుమార్​ సింగ్​ మృతి చెందారు.

ఏప్రిల్​ 15న కరోనా బారిన పడిన ఆయన.. పట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

అరుణ్​ కుమార్​ 1985 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి. చీఫ్​ సెక్రటరీగా దీపక్​ కుమార్​ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాధ్యతలు స్వీకరించారు అరుణ్​ కుమార్​.

ఇదీ చూడండి: మాజీ అటార్నీ జనరల్​ మృతి- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బిహార్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్​కుమార్​ సింగ్​ మృతి చెందారు.

ఏప్రిల్​ 15న కరోనా బారిన పడిన ఆయన.. పట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

అరుణ్​ కుమార్​ 1985 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి. చీఫ్​ సెక్రటరీగా దీపక్​ కుమార్​ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాధ్యతలు స్వీకరించారు అరుణ్​ కుమార్​.

ఇదీ చూడండి: మాజీ అటార్నీ జనరల్​ మృతి- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.