ETV Bharat / bharat

'భరించలేని నొప్పి, ఆకలితోనే ఏనుగు మృతి'

author img

By

Published : Jun 5, 2020, 8:26 PM IST

Updated : Jun 5, 2020, 8:47 PM IST

కేరళలో మృతి చెందిన గర్భిణి ఏనుగు పోస్ట్​మార్టం నివేదికలో కళ్లు చెమర్చే విషయాలు బయటపడ్డాయి. ఏనుగు వారాల పాటు తిండి, నీళ్లు లేక ఆకలితో అలమటించి చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.

Wild elephant had major oral wounds; did not eat for nearly 2 weeks before drowning: Post-mortem report
'భరించలేని నొప్పి, ఆకలి, దాహార్తితోనే ఏనుగు మృతి'

కేరళలో పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్​ను తిని మరణించిన ఏనుగు పోస్టుమార్టంలో హృదయం ద్రవించే నిజాలు వెలుగుచూశాయి. దవడ మొత్తం పూర్తిగా దెబ్బతిని భరించలేని నొప్పి, ఆకలి, దాహార్తితోనే ఏనుగు ప్రాణాలొదినట్లు వైద్యులు తెలిపారు. ఆహారం మాట పక్కనపెడితే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి మరణించే వరకూ దాదాపు రెండు వారాలు తీవ్రమైన నొప్పి కారణంగా ఏనుగు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోలేక నరకయాతన అనుభవించిందని వెల్లడించారు.

తన బాధను ఎవరికి చెప్పాలో.. ఏం చేయాలో తెలీక ఏనుగు అలాగే నదిలో నిల్చుని నీరసంతో కుప్పకూలిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఏనుగు మృతదేహంలో ఎలాంటి బుల్లెట్​ గాయాలు, లోహ వస్తువులు, విదేశీ ఆయుధ పరికరాలు లేవని స్పష్టం చేసింది.

అయితే నదిలో మునిగిపోయిన అనంతరం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే ఏనుగు మృతికి కారణమని మే 28న చేసిన ప్రాథమిక నివేదకలో స్పష్టం చేశారు వైద్యులు.

అమానవీయ ఘటనను యావత్​ దేశం ముక్తకంఠంతో ఖండించింది. నిందితులకు కఠినశిక్ష విధించాలని కోరింది.

ఏనుగు మృతికి కారణమైన వారిలో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఏనుగు మృతిపై కొత్త ట్విస్ట్- ఆ వార్తలు నమ్మొద్దట

కేరళలో పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్​ను తిని మరణించిన ఏనుగు పోస్టుమార్టంలో హృదయం ద్రవించే నిజాలు వెలుగుచూశాయి. దవడ మొత్తం పూర్తిగా దెబ్బతిని భరించలేని నొప్పి, ఆకలి, దాహార్తితోనే ఏనుగు ప్రాణాలొదినట్లు వైద్యులు తెలిపారు. ఆహారం మాట పక్కనపెడితే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి మరణించే వరకూ దాదాపు రెండు వారాలు తీవ్రమైన నొప్పి కారణంగా ఏనుగు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోలేక నరకయాతన అనుభవించిందని వెల్లడించారు.

తన బాధను ఎవరికి చెప్పాలో.. ఏం చేయాలో తెలీక ఏనుగు అలాగే నదిలో నిల్చుని నీరసంతో కుప్పకూలిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఏనుగు మృతదేహంలో ఎలాంటి బుల్లెట్​ గాయాలు, లోహ వస్తువులు, విదేశీ ఆయుధ పరికరాలు లేవని స్పష్టం చేసింది.

అయితే నదిలో మునిగిపోయిన అనంతరం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే ఏనుగు మృతికి కారణమని మే 28న చేసిన ప్రాథమిక నివేదకలో స్పష్టం చేశారు వైద్యులు.

అమానవీయ ఘటనను యావత్​ దేశం ముక్తకంఠంతో ఖండించింది. నిందితులకు కఠినశిక్ష విధించాలని కోరింది.

ఏనుగు మృతికి కారణమైన వారిలో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఏనుగు మృతిపై కొత్త ట్విస్ట్- ఆ వార్తలు నమ్మొద్దట

Last Updated : Jun 5, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.