ETV Bharat / bharat

'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు?'

author img

By

Published : Jul 11, 2020, 8:11 PM IST

కొవిడ్​-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్​ నిధి అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. దాతల పేర్లు పంచుకోవటానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చైనాకు చెందిన పలు సంస్థలు విరాళాలు ఇచ్చినట్లు అందరికి తెలుసని పేర్కొన్నారు.

Rahul
'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. పీఎం కేర్స్​ నిధికి విరాళాలు అందించిన దాతల పేర్లను మోదీ వెల్లడించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాని భయపడుతున్నారా అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

" పీఎం కేర్సు నిధికి విరాళాలు అందించిన వారి పేర్లు వెల్లడించేందుకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు? చైనాకు చెందిన హువావే, షియోమీ, టిక్​టాక్​, వన్​ప్లస్​ వంటి పలు కంపెనీలు విరాళాలు అందించినట్లు ప్రతిఒక్కరికి తెలుసు. ఆయన ఎందుకు వివరాలు పంచుకోవట్లేదు?"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

పీఎం కేర్స్​ నిధులను సమీక్షించేందుకు పార్లమెంట్​ ప్యానల్​ను భాజపా ఎంపీలు అడ్డుకున్నారన్న వార్తలను ట్వీట్​కు జతచేశారు రాహుల్​ గాంధీ.

  • Why is PM so scared of disclosing the names of those who donated money to him for PMCares?

    Everyone knows Chinese companies Huawei, Xiaomi, TikTok and OnePlus gave money.

    Why doesn’t he share the details?https://t.co/DLi8SrJ2Jy

    — Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొద్ది రోజులుగా పీఎం కేర్స్​ నిధులపై ఆడిట్​ జరగాలని రాహుల్​ గాంధీ సహా కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్​. ప్రజల నుంచి డబ్బు అందిన నేపథ్యంలో ఆడిట్​, సమీక్ష పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ ఓ అసత్యాగ్రహి: రాహుల్​ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. పీఎం కేర్స్​ నిధికి విరాళాలు అందించిన దాతల పేర్లను మోదీ వెల్లడించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాని భయపడుతున్నారా అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

" పీఎం కేర్సు నిధికి విరాళాలు అందించిన వారి పేర్లు వెల్లడించేందుకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు? చైనాకు చెందిన హువావే, షియోమీ, టిక్​టాక్​, వన్​ప్లస్​ వంటి పలు కంపెనీలు విరాళాలు అందించినట్లు ప్రతిఒక్కరికి తెలుసు. ఆయన ఎందుకు వివరాలు పంచుకోవట్లేదు?"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

పీఎం కేర్స్​ నిధులను సమీక్షించేందుకు పార్లమెంట్​ ప్యానల్​ను భాజపా ఎంపీలు అడ్డుకున్నారన్న వార్తలను ట్వీట్​కు జతచేశారు రాహుల్​ గాంధీ.

  • Why is PM so scared of disclosing the names of those who donated money to him for PMCares?

    Everyone knows Chinese companies Huawei, Xiaomi, TikTok and OnePlus gave money.

    Why doesn’t he share the details?https://t.co/DLi8SrJ2Jy

    — Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొద్ది రోజులుగా పీఎం కేర్స్​ నిధులపై ఆడిట్​ జరగాలని రాహుల్​ గాంధీ సహా కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్​. ప్రజల నుంచి డబ్బు అందిన నేపథ్యంలో ఆడిట్​, సమీక్ష పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ ఓ అసత్యాగ్రహి: రాహుల్​ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.