ETV Bharat / bharat

'చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు'

author img

By

Published : Jun 18, 2020, 5:29 AM IST

సరిహద్దులో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్​లో చైనాను ఎందుకు ప్రస్తావించలేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ను కాంగ్రెస్ ప్రశ్నించింది. చైనా పేరు ప్రస్తావించకుండా సైన్యాన్ని రాజ్​నాథ్ అవమానించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మరోవైపు.. చైనీయులు భారత సైనికులను అపహరించారా లేదా అన్న విషయం చెప్పాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

Why insult Indian Army by not naming China: Rahul to Rajnath
'చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు'

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో అమరులైన సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ చేసిన ట్వీట్​పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు వ్యక్తం చేశారు. చైనా పేరును ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని అవమానించారని మండిపడ్డారు.

సైనికుల మరణానికి నివాళి అర్పించేందుకు ఎందుకు రెండురోజుల సమయం పట్టిందని ప్రశ్నించారు. ఓవైపు సైనికులు అమరులవుతున్నా... ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై విచారం వ్యక్తం చేశారు.

  • If it was so painful:

    1. Why insult Indian Army by not naming China in your tweet?
    2. Why take 2 days to condole?
    3. Why address rallies as soldiers were being martyred?
    4. Why hide and get the Army blamed by the crony media?
    5. Why make paid-media blame Army instead of GOI? https://t.co/mpLpMRxwS7

    — Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ(రాజ్​నాథ్​నుద్దేశించి) ట్వీట్​లో చైనా పేరు ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని ఎందుకు అవమానించారు. మృతులకు సంతాపం తెలిపేందుకు రెండు రోజులు ఎందుకుపట్టింది? జవానులు మరణిస్తున్నా ఎన్నికల ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నారు? పరిస్థితి నుంచి తప్పించుకొని ఆప్తులైన వార్తా సంస్థల ద్వారా ఆర్మీపై నిందలు మోపుతున్నారు? డబ్బులు తీసుకొని వార్తలు ప్రసారం చేసే ఈ మీడియా సంస్థలు ప్రభుత్వానికి బదులుగా సైన్యాన్ని ఎందుకు నిందించాలి?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం ఈ విషయంలో రాజ్​నాథ్​పై ధ్వజమెత్తారు. చైనాను ట్వీట్​లో ప్రస్తావించడానికి అంత భయమెందుకని ప్రశ్నించారు.

"చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు? మన సైనికులు ఎంతమంది మరణించారు? చైనీయులు మన సైన్యాన్ని అపహరించారా? తప్పుదారి పట్టించకుండా దేశం ముందుకొచ్చి సమాధానాలు చెప్పండి."

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించే బదులు దేశ భద్రతపై దృష్టిసారించి ఉంటే చైనా ఈ దుస్సాహసానికి పాల్పడి ఉండేది కాదని వ్యాఖ్యానించారు సుర్జేవాలా.

రాజ్​నాథ్ ట్వీట్

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి అతిపెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం రాత్రి లద్దాక్​​లోని గాల్వన్ లోయలో జరిగిన ఈ ఘటనలో భారత్​కు చెందిన ఓ కల్నల్ సహా 20 మంది జవానులు ప్రాణాలు కోల్పోయారు.

ఘటనను ఖండిస్తూ బుధవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

"సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మర్చిపోదు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి క్లిష్ట సమయంలో యావత్ భారత్​ వారికి మద్దతుగా నిలుస్తోంది. గాల్వన్‌లో సైనికుల నష్టం బాధాకరమైనది. విధి నిర్వహణలో మా సైనికులు ధైర్యసాహసాలను ప్రదర్శించారు. భారత్​ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు." అంటూ నివాళి అర్పించారు రాజ్​నాథ్

ఇదీ చదవండి: వీరుల ప్రాణ త్యాగాలను వృథాగా పోనివ్వం: మోదీ

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో అమరులైన సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ చేసిన ట్వీట్​పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు వ్యక్తం చేశారు. చైనా పేరును ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని అవమానించారని మండిపడ్డారు.

సైనికుల మరణానికి నివాళి అర్పించేందుకు ఎందుకు రెండురోజుల సమయం పట్టిందని ప్రశ్నించారు. ఓవైపు సైనికులు అమరులవుతున్నా... ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై విచారం వ్యక్తం చేశారు.

  • If it was so painful:

    1. Why insult Indian Army by not naming China in your tweet?
    2. Why take 2 days to condole?
    3. Why address rallies as soldiers were being martyred?
    4. Why hide and get the Army blamed by the crony media?
    5. Why make paid-media blame Army instead of GOI? https://t.co/mpLpMRxwS7

    — Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ(రాజ్​నాథ్​నుద్దేశించి) ట్వీట్​లో చైనా పేరు ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని ఎందుకు అవమానించారు. మృతులకు సంతాపం తెలిపేందుకు రెండు రోజులు ఎందుకుపట్టింది? జవానులు మరణిస్తున్నా ఎన్నికల ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నారు? పరిస్థితి నుంచి తప్పించుకొని ఆప్తులైన వార్తా సంస్థల ద్వారా ఆర్మీపై నిందలు మోపుతున్నారు? డబ్బులు తీసుకొని వార్తలు ప్రసారం చేసే ఈ మీడియా సంస్థలు ప్రభుత్వానికి బదులుగా సైన్యాన్ని ఎందుకు నిందించాలి?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం ఈ విషయంలో రాజ్​నాథ్​పై ధ్వజమెత్తారు. చైనాను ట్వీట్​లో ప్రస్తావించడానికి అంత భయమెందుకని ప్రశ్నించారు.

"చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు? మన సైనికులు ఎంతమంది మరణించారు? చైనీయులు మన సైన్యాన్ని అపహరించారా? తప్పుదారి పట్టించకుండా దేశం ముందుకొచ్చి సమాధానాలు చెప్పండి."

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించే బదులు దేశ భద్రతపై దృష్టిసారించి ఉంటే చైనా ఈ దుస్సాహసానికి పాల్పడి ఉండేది కాదని వ్యాఖ్యానించారు సుర్జేవాలా.

రాజ్​నాథ్ ట్వీట్

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి అతిపెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం రాత్రి లద్దాక్​​లోని గాల్వన్ లోయలో జరిగిన ఈ ఘటనలో భారత్​కు చెందిన ఓ కల్నల్ సహా 20 మంది జవానులు ప్రాణాలు కోల్పోయారు.

ఘటనను ఖండిస్తూ బుధవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

"సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మర్చిపోదు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి క్లిష్ట సమయంలో యావత్ భారత్​ వారికి మద్దతుగా నిలుస్తోంది. గాల్వన్‌లో సైనికుల నష్టం బాధాకరమైనది. విధి నిర్వహణలో మా సైనికులు ధైర్యసాహసాలను ప్రదర్శించారు. భారత్​ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు." అంటూ నివాళి అర్పించారు రాజ్​నాథ్

ఇదీ చదవండి: వీరుల ప్రాణ త్యాగాలను వృథాగా పోనివ్వం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.