ETV Bharat / bharat

'ప్రణాళిక ప్రకారమే 'పౌర' నిరసనల్లో హింస!'

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా కర్ణాటక మంగళూరులో జరిగిన నిరసనల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. నిరసనకారులు ఓ ఆటోలో రాళ్లు తీసుకొచ్చి, భద్రతా సిబ్బందిపైకి విసురుతున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి.

author img

By

Published : Dec 24, 2019, 2:38 PM IST

Updated : Dec 24, 2019, 3:24 PM IST

Watch Mangaluru police release CCTV footage of stone pelting
'పౌర' నిరసనల సీసీటీవీ దృశ్యాలు విడుదల చేసిన పోలీసులు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక మంగళూరులో డిసెంబర్ 19న జరిగిన హింసాత్మక నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ఇందులో నమోదయ్యాయి. పోలీసులపై విసరడానికి ట్రాలీ ఆటోలో దుండగులు రాళ్లు తీసుకొచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, సీసీటీవీ కెమెరాల్లో కనపించకుండా జాగ్రత్త పడ్డారు.

పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాలు

ఈ దృశ్యాలు చూస్తే హింసాత్మక నిరసనలు చేయడానికి ముందుగానే ప్రణాళికలు రచించినట్లు అర్థమవుతోందని భాజపా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించింది. హింసాత్మక నిరసనలను నిలువరించడానికి పోలీసులు చేసిన కృషిని అభినందించారు కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై. రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను అమాయకులుగా పేర్కొన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను తప్పుబట్టారు.

పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించినందునే తప్పని పరిస్థితుల్లో నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావు చెప్పారు.

డిసెంబర్ 19న..

డిసెంబర్ 19న బెంగళూరు, మంగళూరు నగరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల నగరంలో 144వ సెక్షన్ విధించారు పోలీసులు. నలుగురికన్నా ఎక్కువ మంది సమావేశమవడంపై నిషేధం విధించారు. బెంగళూరులో సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహనూ అరెస్ట్​ చేశారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక మంగళూరులో డిసెంబర్ 19న జరిగిన హింసాత్మక నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ఇందులో నమోదయ్యాయి. పోలీసులపై విసరడానికి ట్రాలీ ఆటోలో దుండగులు రాళ్లు తీసుకొచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, సీసీటీవీ కెమెరాల్లో కనపించకుండా జాగ్రత్త పడ్డారు.

పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాలు

ఈ దృశ్యాలు చూస్తే హింసాత్మక నిరసనలు చేయడానికి ముందుగానే ప్రణాళికలు రచించినట్లు అర్థమవుతోందని భాజపా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించింది. హింసాత్మక నిరసనలను నిలువరించడానికి పోలీసులు చేసిన కృషిని అభినందించారు కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై. రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను అమాయకులుగా పేర్కొన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను తప్పుబట్టారు.

పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించినందునే తప్పని పరిస్థితుల్లో నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావు చెప్పారు.

డిసెంబర్ 19న..

డిసెంబర్ 19న బెంగళూరు, మంగళూరు నగరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల నగరంలో 144వ సెక్షన్ విధించారు పోలీసులు. నలుగురికన్నా ఎక్కువ మంది సమావేశమవడంపై నిషేధం విధించారు. బెంగళూరులో సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహనూ అరెస్ట్​ చేశారు.

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2334: Peru Nativity AP Clients Only 4246130
Peru Nativity collector brings joy to others
AP-APTN-2309: Venezuela Attack AP Clients Only 4246129
Caracas accuses opposition of military post attack
AP-APTN-2231: France Hanukkah AP Clients Only 4246126
Holocaust survivors celebrate Hanukkah in Paris
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 24, 2019, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.