ETV Bharat / bharat

దుబే ఎన్​కౌంటర్​పై యూపీ సర్కార్ కీలక నివేదిక

author img

By

Published : Jul 14, 2020, 4:17 PM IST

వికాస్​ దుబే ఎన్​కౌంటర్​కు సంబంధించి అన్ని వివరాలతో స్థితి నివేదిక దాఖలు చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పూర్తి వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేయాలన్న పిటిషన్లను ఈ నెల 20న విచారించనున్నట్టు వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం.

Vikas Dubey encounter: UP to file status report, SC to hear pleas on July 20
దుబే ఎన్​కౌంటర్​పై యూపీ ప్రభుత్వం స్టేటస్​ రిపోర్టు

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే, అతడి అనుచరులను పోలీసులు ఎన్​కౌంటర్ ​చేసిన వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన స్థితి నివేదికను సమర్పించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానానికి ఈ రిపోర్టును శుక్రవారం అందించనున్నట్టు​ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వెల్లడించారు.

దుబే, అతడి అనుచరుల ఎన్​కౌంటర్​తో పాటు 8మంది పోలీసుల మృతిపై విచారించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృతంలో ఓ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇదే విషయంపై దాఖలైన వ్యాజ్యాలను ఈ నెల 20న విచారించనున్నట్టు తెలిపింది.

దుబే ఎన్​కౌంటర్​ ఇలా...

ఉత్తర్​ప్రదేశ్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దుబే. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. గ్యాంగ్​స్టర్​ను వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

కొన్నిరోజుల తర్వాత మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. దుబేను కాన్పుర్​కు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే, అతడి అనుచరులను పోలీసులు ఎన్​కౌంటర్ ​చేసిన వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన స్థితి నివేదికను సమర్పించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానానికి ఈ రిపోర్టును శుక్రవారం అందించనున్నట్టు​ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వెల్లడించారు.

దుబే, అతడి అనుచరుల ఎన్​కౌంటర్​తో పాటు 8మంది పోలీసుల మృతిపై విచారించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృతంలో ఓ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇదే విషయంపై దాఖలైన వ్యాజ్యాలను ఈ నెల 20న విచారించనున్నట్టు తెలిపింది.

దుబే ఎన్​కౌంటర్​ ఇలా...

ఉత్తర్​ప్రదేశ్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దుబే. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. గ్యాంగ్​స్టర్​ను వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

కొన్నిరోజుల తర్వాత మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. దుబేను కాన్పుర్​కు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.